EPFO News
EPFO News : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ .. రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు . తెలుసుకొనే విధానం.
EPFO News: పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే వారు సరదాగా గడపబోతున్నారని చెప్పుకోవాలి. దీంతో చాలా మంది ప్రజల్లో ఇప్పటికే ఉత్సాహం నెలకొంది.
40 ఏళ్లలో తొలిసారిగా.
40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ సొమ్మును ముందుగా బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఈసారి పీఎఫ్ ఉద్యోగులకు వడ్డీ తగ్గించటం వల్ల నిరాశ కలిగించిందని చెప్పుకోవాలి. కోట్లాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే 8.1 శాతం వడ్డీ సొమ్మును పీఎఫ్ ఉద్యోగుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. దీని ప్రకారం.. మీ ఖాతాలో రూ.7 లక్షలు ఉన్నట్లయితే మీకు రూ.56,000 వడ్డీ రూపంలో జమవుతుంది.
ఇంట్లోనే చెక్ చేసుకోవటం ఎలా.
ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. మీరు EPFO రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి EPFO UAN LANని పంపాలి. మీకు ఇంగ్లీష్ లో సమాచారం కావాలంటే.. మీరు LANకి బదులుగా ENG అని టైప్ చేయాలి. మీరు స్మార్ట్ఫోన్లో ప్లే స్టోర్ నుంచి UMANG యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం EPFO ఎంపికపై క్లిక్ చేసి వ్యూ పాస్బుక్కి వెళ్లాలి. OTP ద్వారా మీ UN నంబర్, బ్యాలెన్స్ని చెక్ చేసుకుని పీఎఫ్ ఖాతా వివరాలను సులవుగా తెలుసుకోవచ్చు.
0 Response to "EPFO News"
Post a Comment