Naadu-Nedu
నాడు నేడు సిమెంట్ మరియు ఇసుక సమాచారం
మనబడి నాడు నేడు ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయడమేమనగా
1. మనబడి నాడు-నేడు సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ లను ఐడెంటిఫై చేయడంలో భాగంగా రాష్ట్ర కార్యాలయం వారు కొన్ని పాఠశాలలను ఎంపిక చేయడం జరిగినది.
వాటిలో ఉన్నటువంటి వివరాలను అనగా JPVL స్టాక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది డిపో నేమ్ వద్ద భర్తీ చేయాలి
అంతే కాకుండా ఇసుక 30 టన్నుల లారీ రావడానికి అనుకూలంగా ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా తెలియ జేయాలి. అంతేకాకుండా సంబంధిత CRP పేరు మొబైల్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేసి పంపవలసిందిగా కోరుచున్నాము.
2. నాడు నేడు ముందు సిమెంట్ ఇండెంట్ పెట్టిన పాఠశాలలకు సిమెంట్ సప్లై మొదలైంది. కనుక ప్రధానోపాధ్యాయులు సిమెంట్ సప్లయర్స్ ఫోన్ చేసిన వెంటనే స్పందించి సిమెంటును పొందవలెను.
3. సిమెంట్ పంపిణీ సమయంలో ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రుల కమిటీ సభ్యులు లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లలో ఒకరు అందుబాటులో ఉండి సిమెంటును సరిచూసుకొని అనుకూలమైన ప్రదేశంలో భద్రపరచాలి.
4) సిమెంటు అందిన వెంటనే పాఠశాలల్లో ఉన్నటువంటి నాడు నేడు పనులు సత్వరమే చేపట్టి పురోగతి చూపించాలి.
5) ఇటుకల కొనుగోలు చేసినప్పుడు జిఎస్టి బిల్లు తప్పనిసరి కాదు.
6) నాడు నేడు 10 కాంపోనెంట్లు మంజూరైన పాఠశాలలు టాయిలెట్స్, మేజర్ మైనర్ రిపేర్లు, కిచెన్ షెడ్, ఎలక్ట్రికల్ రిపేర్ లకు సంబంధించిన కాంపోనెంట్ ప్రతిదానికి వోచర్ అప్లోడ్ చేయవలెను.
డిఈవో అనంతపురం, డిఈఓ సత్యసాయి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
0 Response to "Naadu-Nedu"
Post a Comment