Teachers' unions who met Education Minister Botsa Satyanarayana on GO 117.
జీ.ఓ 117 పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలసిన ఉపాధ్యాయ సంఘాలు.
జూనియర్ లెక్చరర్ పోస్ట్ కి B.Ed అర్హత
ఉండేలా ప్రతిపాదనలు.
విద్యాశాఖ మంత్రిశ్రీ బొత్స సత్యనారాయణ
మంత్రి గారితో జరిగిన చర్చల సందర్భంలో వచ్చిన కొన్ని అంశాలు
- ఫౌండేషన్ స్కూల్ లో కనీసం ఇద్దరు టీచర్స్ ఉండేవిధంగా హామీ ఇచ్చారు (1,2తరగతులకు)
- ఫౌండేషన్ ప్లస్ స్కూల్ లో గాని, ఫౌండేషన్ స్కూల్ లో గాని 40 మంది దాటితే మూడవ పోస్ట్ కేటాయించమని అడుగగా పరిశీలిస్తామన్నారు.
- ప్రీ హైస్కూల్ లో 3-8తరగతులకు హెచ్.ఎం ను ఇస్తామని హామీ ఇచ్చారు.
- సంఖ్యతో సంబంధం లేకుండా ఉన్నత పాఠశాలలో హెచ్.ఎం మరియు పి.డి ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
- గరిష్ఠంగా 32పీరియడ్లుకు మించకుండా ఉండాలని మనం డిమాండ్ చేయగా సానుకూలంగా స్పందించారు.
- ఆంగ్లంతో పాటు సమాంతర మాధ్యమాన్ని కొనసాగించమని అడుగగా సానుకూలంగా స్పందించారు.
- మున్సిపాలిటీ ఆస్తులు స్వాదీనం చేసుకోకుండా కేవలం విద్యాశాఖ పర్యవేక్షణలో మాత్రమే మున్సిపల్ పాఠశాలలు నడుస్తాయని, బదిలీలు ప్రమోషన్లు కూడా పాత పద్దతిలోనే జరుగుతాయని సహకరించమని సంఘాలను కోరారు.
- గుంటూరు లో జరిగిన ఏపిటిఎఫ్ మహాసభల సందర్భంలో వేదికపై ప్రస్తావించిన విధంగానే విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే తొలి ప్రయత్నమే ఇది అన్నారు.
- జె.ఎల్ పోస్టులకు ఇకపై బి.ఇడి అర్హత ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని తెలియజేశారు.
- త్వరలో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మీరు అడిగిన డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.
0 Response to "Teachers' unions who met Education Minister Botsa Satyanarayana on GO 117."
Post a Comment