ATM Cash Withdrawal : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? కొత్త ఫీచర్ రాబోతోంది
1. ఏటీఎం సెంటర్ దగ్గర అనేక మోసాలు (ATM Frauds) జరుగుతుంటాయి.
కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్తో పాటు నేరగాళ్లు డబ్బులు డ్రా చేస్తామని నమ్మించి మోసం చేయడం లాంటి ఘటనలు మామూలే. ఇలాంటి మోసాలు ఎక్కువవుతుండటంతో బ్యాంకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొస్తున్నాయి.
2. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పటికే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) బేస్డ్ క్యాష్ విత్డ్రాయల్ సర్వీస్ను తమ కస్టమర్ల కోసం చాలా కాలం క్రితమే ప్రారంభించాయి. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి ఎస్బీఐ అందిస్తున్న అదనపు సెక్యూరిటీ లేయర్ ఇది. ఎవరైనా డబ్బులు డ్రా చేయాలనుకుంటే పిన్తో పాటు ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
3. ఎస్బీఐ ఏటీఎంలో రూ.10,000 కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేయాలంటే డెబిట్ కార్డ్ పిన్తో పాటు ఓటీపీ కూడా తప్పనిసరి. అంటే రూ.10,000 లోపు డ్రా చేస్తే ఏటీఎం కార్డ్ పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఓటీపీ అవసరం లేదు. ఏటీఎం కార్డ్ మోసగాళ్ల చేతికి చిక్కినా భారీ మొత్తంలో మోసపోకుండా ఉండటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
4. ఇప్పుడు ఇదే ఫీచర్ను ఇతర బ్యాంకులు కూడా తీసుకురాబోతున్నాయి. ఈ ఫీచర్ వస్తే ఇక ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ కూడా తప్పనిసరి. అకౌంట్ హోల్డర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఒక ట్రాన్సాక్షన్కు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కొంత సమయం వరకే ఓటీపీ పనిచేస్తుంది.
5. ఎస్బీఐ ఈ ఫీచర్ తీసుకొచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. 2020 జనవరి 1న ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్డ్రాయల్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ ఫీచర్ వాడుకోవాలని ఏటీఎం కార్డ్ హోల్డర్స్ని కోరుతోంది ఎస్బీఐ. మోసాలను అడ్డుకోవడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది.
6. ఎస్బీఐ కస్టమర్లు ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్డ్రాయల్ సర్వీస్ కోసం ముందుగా ఎస్బీఐ ఏటీఎంలో మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి. ఆ తర్వాత డ్రా చేయాలనుకునే అమౌంట్ ఎంటర్ చేయాలి. రూ.10,000 కన్నా ఎక్కువ మొత్తం అయితే కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
నాలుగు అంకెల ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్డ్రా చేయొచ్చు.
0 Response to "ATM Cash Withdrawal"
Post a Comment