Let's know how Abbot Yogi Adityanath became CM.
మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ సీఎం ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
చిన్న వయసులోనే పార్లమెంట్ కు వెళ్లి మఠాధిపతిగా వ్యవహరిస్తూ సీఎం బాధ్యతలు చేపట్టడం మాత్రమే కాకుండా భావి భారత ప్రధాని అంటూ కూడా కీర్తించబడుతున్న యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ బిస్ట్. 1972 జూన్ 5వ తారీకున రాజ్పుట్ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులకు ఆదిత్యనాథ్ రెండవ సంతానంగా జన్మించారు. మొత్తం నలుగురు సోదరులు మరియు ముగ్గురు సోదరిలు ఉన్నారు.
ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో గల హెచ్ఎన్బీ గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేశారు. ప్రజలకు సేవ చేయాలని.. హిందూ మతం ను కాపాడుకుంటూ ప్రచారం చేయాలని భావించాడు. ఆర్ ఎస్ ఎస్ లో కీలక నేతగా ఎదగడం వల్ల 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఎన్నికయ్యారు.
హిందూ మతం పట్ల ఆయనకు విపరీతమైన ఆరాధన భావం ఉండేది. 26 ఏళ్ల వయసులోనే గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్సభలో అడుగు పెట్టి అరుదైన ఘనత దక్కించుకున్నాడు.. 44 ఏళ్లకే దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. 2007లో గోరఖ్పూర్ లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. ఆ సమయంలో ఆదిత్యనాథ్ కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును తెచ్చి పెట్టాయి. 2017 మార్చిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయంలో కీలక పాత్ర ను అప్పటి ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ పోషించాడు. ఆ కారణంగానే అధినాయకత్వం ఆయనకు ప్రభుత్వ పగ్గాలను కట్టబెట్టేందుకు సిద్దం అయ్యింది.
హిందుత్వ వాదంతో యూపీలో అయిదు సంవత్సరాల పరిపాలన కొనసాగించిన యోగి ఆదిత్యనాథ్ మళ్లీ అధికారం దక్కించుకున్నారు. ఇప్పటికే యోగి ఆధిత్యనాధ్ అక్కడ చేసిన అభివృద్ధి కారణంగా రెండో సారి అధికారం దక్కింది. ఈ విజయ పరంపర కొనసాగుతుందని.. భవిష్యత్తులో మోడీ వారసుడిగా బీజేపీ పగ్గాలు చేతబట్టి కేంద్రంలో చక్రం తిప్పడం మాత్రమే కాకుండా ప్రధాని గా కూడా ఎంపిక అయ్యేంత ప్రతిభ అర్హత ఉన్న వ్యక్తి యోగి అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు. యోగి జాతీయ రాజకీయాలు కొన్ని వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తున్న మాట కూడా వాస్తవం.
0 Response to "Let's know how Abbot Yogi Adityanath became CM."
Post a Comment