Merger is to solve problems
సమస్యలు పరిష్కరించాకే విలీనం
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి . రాజశేఖర్
ఉయ్ ఆర్ నాట్ ఫర్ఫెక్ట్ . అందరికీ తెలుసు ప్రభుత్వ స్థాయిలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి . మిస్టేక్స్ జరిగితే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి . నేనే దో ఆర్డర్ ఇచ్చేశాను కాబట్టి అమలు చేసి తీరాలని అనడం లేదు " అని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి బి . రాజశేఖర్ అన్నారు .
తరగతుల విలీనానికి సంబంధించి ఎక్కడన్నా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు . సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు .
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అమల్లో భాగంగా విద్యార్థులు కేంద్ర బిందువుగానే రాష్ట్రంలో విద్యా విధానా లను రూపొందించి అమలు చేస్తామన్నారు
విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా తరగతుల విలీనం చేయడం జర గదని , సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రక్రియ చేపడతా మని స్పష్టం చేశారు .
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,870 పాఠ శాలలను విలీనం చేయగా కేవలం 820 బడులకు సంబం ధించి కొన్ని సమస్యలు ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు . ఆయా పాఠశాలలను పరిశీలించి సమ స్యలపై నివేదించాలని కమిటీని వేశామన్నారు
0 Response to "Merger is to solve problems"
Post a Comment