Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM Kisan

 PM Kisan : రైతులకు కేంద్రం గుడ్న్యూస్ ఆగస్టు 31 వరకు గడువు పెంపు .. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం.

PM Kisan


PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది మోడీ సర్కార్‌.

ఇక కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలలో ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు ఏడాదికి రూ.6,000 చొప్పున సాయం అందుకోవచ్చు. ఈ పథకం కింద ఏడాదిలో మూడు విడతల్లో ఈ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. సంవత్సరంలో మూడు దఫాల్లో రూ.2,000 చొప్పున రైతులు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత అందుకోనున్నారు. ఈ విడత డబ్బులు సెప్టెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇక ఈ పథకంలో ముఖ్య విషయం ఏంటంటే.. కేవైసీ. ఈ పథకం కింద సాయం పొందుతున్న ప్రతి రైతు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ కావు. అందుకే వ్యవసాయంలో పెట్టుబడి సాయంగా ఈ డబ్బులు అందుకోవాలంటే ఈకేవైసీ (EKYC) చేసుకోవడం తప్పనిసరి.

ఈకేవైసీ గడువు పెంపు..
ఇప్పటి వరకు ఈకేవైసీ గడువు జులై 31తో ముసిగిన విషయం తెలిసిందే. ఇంకా కొంత మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో మోడా ప్రభుత్వం రైతులకు మరోమారు అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు మీ ఖాతాలో జమ కావని గుర్తించుకోవాలి. వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి..?

  • ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.
  • అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.
  • ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.
  • అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఇక మీ దగ్గరలో ఉన్న ఈ-సేవ కేంద్రాలకు కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PM Kisan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0