PM Kisan
PM Kisan : రైతులకు కేంద్రం గుడ్న్యూస్ ఆగస్టు 31 వరకు గడువు పెంపు .. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం.
PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది మోడీ సర్కార్.
ఈకేవైసీ గడువు పెంపు..
ఇప్పటి వరకు ఈకేవైసీ గడువు జులై 31తో ముసిగిన విషయం తెలిసిందే. ఇంకా కొంత మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో మోడా ప్రభుత్వం రైతులకు మరోమారు అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు మీ ఖాతాలో జమ కావని గుర్తించుకోవాలి. వెంటనే ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి..?
- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
- ఆ వెబ్సైట్లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్ చేయాలి.
- అందులో ఆధార్ నెంబర్, కనిపించే కోడ్ను నమోదు చేయాలి.
- ఆధార్తో లింకైన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి.
- పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయాలి.
- అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
- ఇక మీ దగ్గరలో ఉన్న ఈ-సేవ కేంద్రాలకు కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.
0 Response to "PM Kisan"
Post a Comment