Should we teach lessons.. wrestle with apps?
మేం పాఠాలు చెప్పాలా.. యాప్లతో కుస్తీ పట్టాలా?
ఉపాధ్యాయుల ఆవేదన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ హాజరు విధానం ఉపాధ్యాయులను ముపుతిప్పలు పెడుతుంది. ఒక ముడి విప్పబోయి మరో ముప్ఫై మూడు ముడులు వేసుకుంటే ఇక ఎప్పటికీ ఒక్క ముడిని కూడా విప్పలేము. అలాగే సమస్య ఎక్కడ ఉందో గుర్తించి దానిని పరిష్కరించాలి.. కానీ, మొత్తం గందరగోళంగా చేసుకోకూడదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తొలిరోజే ఈ ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది. '' మేం విద్యార్ధులకు పాఠాలే చెప్పాలా..యాప్ లతో కుస్తీ పట్టాలా'' అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. యాప్ అటెండెన్స్ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
కాగా ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. యాప్ డౌన్లోడ్కు తోడు.. ఫొటో అప్లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం.. ఉపాధ్యాయులపై కక్షసాధింపుగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పీఎఫ్ నిధులు ఇంకా జమకు నోచుకోలేదని విమర్శిస్తున్నారు.. మొత్తంగా.. టీచర్స్ అటెండెన్స్ యాప్తో మొదటి రోజే తిప్పలు తప్పలేదు.. నెట్ లేక కొంతమంది, స్మార్ట్స్ ఫోన్స్ లేక ఇంకొంత మంది ఈ యాప్తో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.. డౌన్లోడ్ ప్రాబ్లమ్, నెట్ వర్క్ ప్రాబ్లెమ్ తో ఏం చేయాలో తెలియక టీచర్స్ తలాలు పట్టుకుంటున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పడేసి.. ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ విధులను బారు కాట్ చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.
0 Response to "Should we teach lessons.. wrestle with apps?"
Post a Comment