Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The amount of GPF has been debited by Rs.413 crores

జీపీఎఫ్ సొమ్ము రూ.413 కోట్లు డెబిట్ అయింది

The amount of GPF has been debited by Rs.413 crores


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్

ఈనాడు, దిల్లీ: ఏపీ ట్రెజరీల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 68,020 మంది ఖాతాదారుల నుంచి రూ.413 కోట్ల జీపీఎఫ్ సొమ్ము డెబిట్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. సోమవారం లోక్సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 'ఉద్యోగులకు ఎలాంటి సమాచారం అందించకుండా, వారి అనుమతి తీసుకో కుండానే 2021, 2022ల్లో వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్మును ఉప సంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏజీ కార్యాలయం అనుమతి ఇచ్చిన విషయం కేంద్ర దృష్టికి వచ్చిందా' అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 'ఏపీ జీపీఎఫ్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలను అకౌంటెంట్ జనరల్ నిర్వహిస్తున్నారు. విత్ డ్రాయల్స్, డిపాజిట్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల నుంచి వచ్చే నెలవారీ ఖాతాలకు సంబంధిం చిన దస్తావేజుల ప్రకారమే జరుగుతాయి. జీపీఎఫ్ ఖాతాల్లోకి డిపాజిట్లు (క్రెడిట్స్), విత్ డ్రాయల్స్ (డెబిట్స్) కు సంబంధించిన ఎంట్రీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల నుంచి వచ్చిన దస్తావేజుల ఆధారంగానే చేశాం. దాని ప్రకారం ఏజీ కార్యాలయం 68,020 మంది జీపీఎఫ్ చందాదారులకు సంబంధించిన రూ. 413.73 కోట్లను డెబిట్ చేసింది' అని కేంద్రమంత్రి తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The amount of GPF has been debited by Rs.413 crores"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0