Chief Minister YS Jaganmohan Reddy held a review meeting on the performance of AP Education Department
ఎపి విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు సమీక్షా సమావేశం
ఎపి విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యార
- పాఠశాల విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
- నాడు నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించిన అధికారులు .
- వాటికి సంబంధించిన వివరాలును సీఎంకు అందించిన అధికారులు .
- స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని , వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు . తెలిపిన అధికారులు .
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే .
- నాడు - నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్ చేయాలని సీఎం ఆదేశం .
- ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలన్న సీఎం
- స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా ? లేదా ? అన్నది పరిశీలన చేయాలి.
- అవసరమైన చోట వెంటనే పనులు , మరమ్మతులు చేయించాలి.
- స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి .
- ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్ను స్కూళ్లలో ప్రదర్శించాలన్న సీఎం .
- ఈ నంబర్కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలన్న సీఎం .
- 14417 టోల్ నంబర్ను ఏర్పాటు చేశామన్న అధికారులు .
విద్యాకానుకపైనా సీఎం సమీక్ష .
- వచ్చే ఏడాది జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకున్నామన్న అధికారులు .
- స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలన్న సీఎం .
- యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్న సీఎం .
- స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలని సీఎం ఆదేశం
- స్కూళ్ల అభివృద్ధి , నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్న సీఎం .
- గ్రామంలో పారిశుద్ధ్యం , తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం .
- వీటిపై ఎప్పకప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలన్న సీఎం .
- నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం .
- దీంతో పారిశుద్ధ్య లోపం . వల్ల , నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందన్న సీఎం .
- సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు స్కూళ్ల నిర్వహణలో భాగస్వామ్యం కానున్న సచివాలయ ఉద్యోగులు .
- ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ , మహిళా పోలీసు సందర్శన .
- నెలకోసారి ఏఎన్ఎం సందర్శన .
- ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్ఓపీ తయారు చేశామన్న అధికారులు .
- స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్లతో సహా అప్లోడ్ చేయనున్న ముగ్గురు సచివాలయ సిబ్బంది .
- వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్న అధికారులు . - మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో ( ఎంఈఓ ) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు , మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలన్న సీఎం .
- టీచర్లకు , 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని సమీక్షించిన సీఎం .
- 5,18,740 ట్యాబ్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం .
- ట్యాబ్లో బైజూస్ కంటెంట్ తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను , ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం .
- ఈ కార్యక్రమంపైనా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి .
- దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనావేసిన అధికారులు .
- దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం .
- దాదాపు రూ . 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా .
- వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్ జరగేలా చూడాలన్న సీఎం .
- అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు . - డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం , ఆర్బీకేలు , విలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం .
ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , సీఎస్ సమీర్ శర్మ , పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ , పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ , స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్ , ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు , పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు .
0 Response to "Chief Minister YS Jaganmohan Reddy held a review meeting on the performance of AP Education Department"
Post a Comment