Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

3.98 lakh students in government schools decreased

ప్రభుత్వ బడుల్లో తగ్గిన విద్యార్థులు 3.98 లక్షలు


  • పిల్లలు పుట్టడం తగ్గి. ప్రవేశాలు కొంత తగ్గాయి.
  • పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదితో పోల్చితే 3.98 లక్షలమంది విద్యార్థులు తగ్గినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కరోనా సమయంలో ప్రైవేటు ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం వల్ల దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. వచ్చిన వారిలో కొంతమంది వెనక్కి వెళ్లిపోయారని తెలిపింది. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని కూడా చెప్పడం విశేషం. సోమవారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ విలేకర్ల సమావేశంలో విద్యార్థులకు సంబంధించి ఈ వివరాలు వెల్లడించారు. కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో చేరినవారిలో అందరూ వెళ్లిపోలేదని, ఇంకా 2.12 లక్షల మంది పిల్లలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని చెప్పారు. కర్నూలులో ఒక ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారని తెలిపారు. పదోతరగతి పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమంలో 77.55%, తెలుగు మాధ్య మంలో 43.97% మంది ఉత్తీర్ణులయ్యారని, ఆంగ్లంలో చదివిన వారే ఎక్కువ ఉత్తీర్ణులవుతున్నారని ఆయన చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు కేంద్ర ప్రభుత్వ యూడైస్ ప్లస్ డేటానే ప్రామాణికమని రాజశేఖర్ తెలిపారు. విద్యార్థుల వివరాల నమోదు సెప్టెంబరు 30తో ముగిసినందున యూడైస్ పూర్తి కాక.. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చా మన్నారు. వలసల కారణంగా 16,857 మంది, సీజనల్ వలసల వల్ల 38,951 మంది బడి మానేశారని.. 1,289 మంది చనిపోయారని తెలిపారు. సీజనల్ వలసల్లో 12,000 మందిని తిరిగి బడుల్లో చేర్పించామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా సత్ఫలితాలు రావని పేర్కొన్న ఆయన ప్రభుత్వ విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు సైతం బ్రహ్మాండంగా ఆంగ్లంలో మాట్లాడుతున్నారని, బెండపూడి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ఒక కొత్త విధానంలో భాష నేర్పుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలోని ఆంగ్ల టీచర్ సైతం బెండపూడికి వచ్చి అభినందించారని రాజశేఖర్ వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "3.98 lakh students in government schools decreased"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0