Free food for train passengers .. Indian Railways launched a new service
IRCTC : రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం .. సరికొత్త సేవను ప్రారంభించిన ఇండియన్ రైల్వే
ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం పలు రకాల సేవలను అందిస్తోంది. అయితే రైల్వే శాఖ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ప్రయానికులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది.
భారతీయ రైల్వే ఈ సదుపాయం ప్రతి రైలులోని ప్రయాణికులకు కాదు. దురంతో ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి లగ్జరీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రైలు రాక లేదా బయలుదేరినప్పుడు ఉచిత ఆహారం ప్రయోజనం అందుబాటులో ఉండదు. అయితే రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే మీరు ఉచిత ఆహారాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా మీరు ఆహారంతో పాటు ఇతర పానీయాలను కూడా పొందవచ్చు.
ఐఆర్సీటీసీ కూడా ఆహార సౌకర్యాన్ని కల్పిస్తోంది
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రయాణికుల సౌకర్యార్థం, నాణ్యత కోసం కొత్త వంటశాలలను నిర్మించడం, పాత వాటిని పునరుద్ధరించడం ద్వారా తన ఆహార సేవల మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. IRCTC తన కస్టమర్లకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వాట్సాప్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
మీరు యాప్ సహాయంతో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు
రైలులో ఐఆర్సీటీసీ యాప్ సహాయంతో మీరు ఇప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం ప్రయాణికులకు వారి పీఎన్ఆర్ నంబర్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే దీపావళి, ఛత్ కోసం అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవి ఢిల్లీ నుండి బీహార్, యూపీ నగరాలకు, కొన్ని ఇతర ప్రాంతాలకు నడుపుతోంది. పండుగలకు ఇంటికి వెళ్లడానికి మీకు కన్ఫర్మ్ టికెట్ లభించకపోతే, మీరు ఈ రైళ్లలో బుక్ చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
0 Response to "Free food for train passengers .. Indian Railways launched a new service "
Post a Comment