Good News to Students
Good News to Students : విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆ పథకంలో కీలక మార్పులు .. కొత్తగా రంగులు.
Good News to Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) సంక్షేమ పథకాలపై (Welfare Schemes) పూర్తిగా ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలపై ఎక్కువగా ఖర్చు చేయాలన్నదే తన లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy ).
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో జగనన్న గోరుముద్ద ఒకటి. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. జగనన్న గోరుముద్దలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఒకటి చొప్పున మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు. ఇటీవల కొన్ని చోట్ల మధ్యాహ్నం భోజనంలో అందించే గుడ్డు నాణ్యత లేకపోవడం.. పాడైపోయిన గుడ్లు విద్యార్థులకు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా విమర్శల నేపథ్యంలో ఈ పథకంలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం.. 10 రోజులకు ఒక్కసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ప్రతి వారం వచ్చే గుడ్లకు నాలుగు రంగుల స్టాంప్ లు వేస్తారు. గుడ్ల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా.. మొదటి వారం నీలం, రెండో వారం గులాబీ, మూడోవారం ఆకుపచ్చ, నాల్గవ వారం వంగపువ్వు రంగులతో గుడ్లపై స్టాంపింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకానికి నిధుల కేటాయింపును కూడా ఆ మేరకు పెంచింది.
ఈ పథకానికి 2020-21లో 1,546 కోట్లు, 2021-22లో 1,797 కోట్లు ఖర్చు పెట్టింది. 2022-23 విద్యాసంవత్సరానికి 1,908 కోట్లు కేటాయించింది. అలాగే గతంలో ఈ పథకం కింద 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి 43.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం వారానికి ఒక మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గుడ్లు, చిక్కీలు సహా అన్నం, పప్పుచారు, పులిహోర, పప్పూటమోటా, ఆలూకుర్మా, కిచిడి, పొంగలి.. ఇలా రోజుకోరకమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి విద్యార్థికి వారానికి 5 గుడ్లు అందిస్తున్నారు.
0 Response to "Good News to Students "
Post a Comment