Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confusion in formative-1 tests

ఫార్మెటివ్-1 పరీక్షలలో గందరగోళం

Confusion in formative-1 tests

  • ప్రశ్నపత్రంలో నాలుగు ఆప్షన్లు
  • ఓఎంఆర్‌ షీట్‌లో ఐదు.
  • విద్యార్థుల్లో అయోమయం
  • విద్యాశాఖ తీరుపై టీచర్లు మండిపాటు

ఫార్మెటివ్-1 పరీక్షల నిర్వహణ తొలిరోజు గందరగోళంగా సాగింది. పరీక్ష విద్యార్థులకు కాకుండా తమకు నిర్వహించినట్టుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వ హించారు. ఈ పరీక్షలలో తొలిసారి ఓఎంఆర్‌ విధానం అమలుచేశారు. ప్రతి సబ్జక్టులో 15 మార్కులకు ఆబ్జక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు జవాబుపత్రంలో రాయాలి. అదే సమయంలో ఓఎంఆర్‌ షీట్‌లో బబ్లింగ్‌ చేయాలి. అయితే ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన నిర్వాహకులు, ఓఎంఆర్‌ షీట్‌లో ఐదు ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

ఫార్మెటివ్‌-1 పరీక్షల నిర్వహణ తొలిరోజు గందరగోళంగా సాగింది. పరీక్ష విద్యార్థులకు కాకుండా తమకు నిర్వహించి నట్టుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వ హించారు. ఈ పరీక్షలలో తొలిసారి ఓఎంఆర్‌ విధానం అమలుచేశారు. ప్రతి సబ్జక్టులో 15 మార్కులకు ఆబ్జక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు జవాబుపత్రంలో రాయాలి. అదే సమయంలో ఓఎంఆర్‌ షీట్‌లో బబ్లింగ్‌ చేయాలి. అయితే ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన నిర్వాహకులు, ఓఎంఆర్‌ షీట్‌లో ఐదు ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రశ్నకు విద్యార్థి ఓఎంఆర్‌ షీట్‌లో బబ్లింగ్‌ చేయని పక్షంలో...సంబంధిత క్లాస్‌ టీచర్‌ 'ఈ'ను ఎంపిక చేసి బబ్లింగ్‌ చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. ప్రశ్నపత్రంలో నాలుగు, ఓఎంఆర్‌ షీటులో ఐదు ఆప్షన్లు ఇవ్వడంపై విద్యార్థులు సందేహం వ్యక్తంచేయడంతో ఉపాధ్యాయులే 'ఈ'ను బబ్లింగ్‌ చేశారు. అలాగే ఓఎంఆర్‌ షీటుపై ఆరు సబ్జక్టుల (తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, గణితం, సైన్స్‌, సోషల్‌) కు సంబంధించి వేర్వేరుగా 15 ప్రశ్నలు వంతున ముద్రించారు. బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వహించగా...కొందరు గణితానికి బదులుగా ఓఎంఆర్‌ షీట్‌లో హిందీ పరీక్షకు కేటాయించినచోట బబ్లింగ్‌ చేశారు. ఉపాధ్యాయులు గుర్తించి...విద్యార్థులకు మళ్లీ ఓఎంఆర్‌ షీట్లను సరఫరా చేసి తెలుగు, తరువాత గణితం పరీక్షలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు బబ్లింగ్‌ చేయించారు. పరీక్షలు విద్యార్థులకు కాకుండా టీచర్లకు నిర్వహించినట్టుందని ఉపాధ్యాయ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యా శాఖలో పరీక్షల నిర్వహణ విభాగం అవగాహన రాహిత్యం మరోమారు బహిర్గతమైందని విమర్శించారు. దీనికితోడు ఉదయం పాఠశాల ప్రారంభంలో విద్యార్థులు హాజరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాత పరీక్షలు ఎంతమంది రాస్తున్నారని మరోసారి హాజరు నమోదుచేయాలని ఆదేశించడం చూస్తే...టీచర్లను కావాలనే ప్రభుత్వం వేధిస్తున్నట్టు కనిపిస్తోందని అనకాపల్లి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఒకరు వ్యాఖ్యానించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confusion in formative-1 tests"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0