Teachers Transfers
టీచర్ల బదిలీలపై వీడని ఉత్కంఠ
హైకోర్టులో కేసులు 20వ తేదీకి వాయిదా
ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పునర్విభజన, పాఠశాలల విలీనం, బదిలీల్లో పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించిప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై వేలాది మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టకూడదని, పాఠశాలల విలీనం నిలిపివేయాలని కొందరు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులతో సంబంధిత టీచర్లకు ఉపశమనం కలిగించిన హైకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ చేపట్టింది. వీటన్నింటినీ కలిపి ప్రభుత్వం కామన్ కౌంటర్ను దాఖలు చేసింది. హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించిన జీవో నెంబరు 117 పై వాదనలు వినిపించారు. దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు విని తుది నిర్ణయం తీసుకొనేందుకు ఈనెల 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
టీచర్ల రిలీవింగ్ లేనట్లే
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హైకోర్టు ఈనెల 20న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించినా టీచర్లు వెంటనే రిలీవ్ అయి కొత్త స్థానాల్లో చేరే పరిస్థితి లేదు. జిల్లాలో మొత్తం 5,757 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే బదిలీల జీవోలోని అసంబద్ధాలపై పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం అన్ని కేసులకు సమాధానంగా కామన్ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టులో కేసులు తీర్పు పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
0 Response to "Teachers Transfers"
Post a Comment