Principal Secretary, Education, Anantapur District
అనంతపురం జిల్లాకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
- ఉపాధ్యాయుల్లో గుబులు
- తనిఖీ చేస్తారని.. ఉదయమే స్కూళ్లకు పరుగులు
అయ్యవార్లలో అ‘టెన్షన’ మొదలైంది. ఆయన జిల్లాకు వస్తారన్న సమాచారం రాగానే సాధారణంగా ఆలస్యంగా వెళ్లే టీచర్లు సైతం అరగంట ముందుగానే స్కూళ్లకు వెళ్లారు. ఆయన జిల్లాలో ఉంటారన్న సమాచారం నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయుల్లో గుబులు రేగింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ జిల్లా పర్యటనతోనే ఈ గుబులంతా. ప్రవీణ్ ప్రకాష్ జిల్లా పర్యటకు వస్తున్నారన్న నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా చాలా స్కూళ్లకు టీచర్లు ముందుగానే పరుగులు తీశారు. ఆయన ఎప్పుడు, ఎక్కడికి వచ్చి విజిట్ చేసి వేటు వేస్తారోనన్న భయంతో పంతుళ్లు పరుగులు తీశారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నట్లు ఉపాధ్యాయవర్గాలు, విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ గురువారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. డీఈఓ సాయిరాం, ఇతర విద్యాశాఖాధికారులు ఆయనను రిసీవ్ చేసుకున్నారు. జిల్ల్లాకు చేరుకున్న ఆయన ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్లో దిగారు. తర్వాత కలెక్టరేట్కు వెళ్లారు. ఆయన జిల్లా టూర్ నేపథ్యంలో ఏ టైంలో ఏ స్కూల్ను, ఏ హాస్టల్ను విజిట్ చేస్తారో....? ఆయన ఎలా రియాక్ట్ట్ అవుతారోననంటూ...ఉపాధ్యాయుల్లో, ఇతర ఉద్యోగుల్లోనూ అ‘టెన్షన’ మొదలైంది.
0 Response to "Principal Secretary, Education, Anantapur District"
Post a Comment