Teachers transfers
బదిలీలు ఎప్పుడో?
- ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు
- కోర్టులో కొనసాగుతున్న విచారణ*
- ప్రభుత్వం చొరవచూపాలని గురువుల విజ్ఞప్తి
ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పష్టత రాకపోవడంతో బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. బదిలీలపై దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2న విచారణకు రావాల్సి ఉండగా బెంచ్ మారడంతో వీలుకాలేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతేడాది డిసెంబరులోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 4,274 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ బదిలీల ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన, ప్రొవిజనల్ జాబితాను వెలువరించారు. బదిలీ ఉత్తర్వుల్లో అనేక నిబంధనలు విధించారు. ఈ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తుది జాబితాను వెలువరించొద్దని ఆదేశించింది. దీంతో బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. బదిలీలపై కోర్టు విచారణ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో? అటు తరువాత ప్రభుత్వం బదిలీలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోన్న సంశయం ఉపాధ్యాయుల్లో నెలకొంది. అసలు బదిలీలు జరుగుతాయా లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బదిలీలపై విద్యాశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు
చొరవ చూపాలి
ఉపాధ్యాయ బదిలీలు జరపడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. కోర్టు కేసులను సాకుగా చూపి జాప్యం చేయకూడదు. కేసులు సత్వర పరిష్కారానికి ప్రభుత్వమే శ్రద్ధ చూపాలి. ఈ నెలలోనే బదిలీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
బోడెల విజయకుమార్, యూటీఎఫ్ ఉమ్మడి జిల్లా సహా అధ్యక్షడు
చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేపట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఏదో జీవోలిచ్చాం కదా అని సరిపెట్టకూడదు. కేసులకు సత్వర పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడాలి.®️👆
0 Response to "Teachers transfers"
Post a Comment