Doing justice to the teaching profession?
ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తున్నారా?
రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, వృత్తికి చేస్తున్న న్యాయం ఇదేనా? అని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3, 4 తరగతుల విద్యార్థుల ఆంగ్ల పాఠ్యపుస్తకాలను పరిశీలించి గ్రామర్ పూర్తి చేయాలని పురమాయించారు. ఎక్కువ మంది విద్యార్థులు తప్పులు రాయడం, కొంతమంది పూర్తి చేయకుండా ఖాళీగా వదిలేయడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వంద శాతం ఫలితాలు రావాలని నేను చెప్పడం లేదు. విద్యార్థులకు అర్థమయ్యేలా, వృత్తికి న్యాయం చేసేలా పనిచేయాలి’ అని సూచించారు. అందరిలో మార్పు రావాలన్నారు. ఆర్జేడీ నాగమణి, కాకినాడ, తూర్పుగోదావరి డీఈవోలు అన్నపూర్ణ, అబ్రహం తదితరులు ఆయన వెంట ఉన్నారు.
0 Response to "Doing justice to the teaching profession?"
Post a Comment