Good news for village and ward volunteers in AP..Rs.10 thousand to Rs.30 thousand each!
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు!
Ap Volunteers: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు జగన్ (Cm Jagan) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పక్కాగా అమలు చేస్తూ నిస్వార్ధంగా పని చేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. మే 19న విజయవాడలో సీఎం జగన్ (Cm Jagan) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత నెల రోజుల పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా వాలంటీర్ల సేవలని గుర్తిస్తూ ప్రతీ ఏటా 'వాలంటీర్లకు వందనం' పేరుతో వారిని సత్కరిస్తుంది. మొత్తం మూడు రకాల అవార్డులతో వారిని ప్రభుత్వం సత్కరిస్తుంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజవర్గంలో ఐదుగురు వాలంటీర్ల చొప్పున సేవా వజ్ర అవార్డును ప్రధానం చేయనున్నారు. అలాగే ఈ అవార్డు అందుకునే వారికీ రూ.30 వేల నగదు, బహుమతి, మెడల్ బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ తో సత్కరిస్తారు. అలాగే ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున నగర కార్పొరేషన్ కు 10 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు పొందిన వారికీ రూ.10 వేల నగదు బహుమతి, మెడల్ బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందిస్తారు. ఇక మూడో అవార్డు విషయానికొస్తే..ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పని చేసే మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డును అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతిని అందజేస్తారు.
0 Response to "Good news for village and ward volunteers in AP..Rs.10 thousand to Rs.30 thousand each!"
Post a Comment