Telangana 'Padi' results today
తెలంగాణ 'పది' ఫలితాలు నేడే
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలను www.eenadu.net, eenadupratibha.net, bse.telangana.gov.in, bseresults.telangana.gov.inతదితర వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తొమ్మిది మంది పాత విద్యార్థులకు సంబంధించి తెలుగు పరీక్ష జవాబుపత్రాల బండిల్ కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారిని అంతర్గత మార్కులు ఆధారంగా పాస్ చేసినట్లు తెలిసింది.
0 Response to "Telangana 'Padi' results today"
Post a Comment