Viral News
Viral News: చనిపోయిన వారు మళ్లీ పుడతారా.? ఈ కుర్రాడు చెబుతోన్న మాటలు వింటే నిజమే అనిపిస్తుంది.
పునర్జన్మలు నిజంగానే ఉంటాయా.? చనిపోయిన వారు మళ్లీ మనిషిగా జన్మిస్తారా.? దీనిపై ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ పునర్జన్మను చాలా మంది విశ్వసిస్తుంటారు.
కొన్ని సంఘటనలు పునర్జన్మలు నిజంగానే ఉంటాయన్న దానికి ఊతమిస్తున్నాయి. 8 ఏళ్ల కుర్రాడు గత జన్మలో జరిగిన సంఘటనలను వరుస పెట్టి చెప్పుకొస్తుంటే అందరూ అవాక్కవతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాకు చెందిన ఆర్యన్ దూబే అనే 8 ఏళ్ల పిల్లాడు ఇటీవల తన తల్లితో కలిసి అమమ్మ వాళ్లింటికి వెళ్లాడు.
అదే సమయంలో అమమ్మ పాదాలకు నమస్మరించమని తల్లి అనగా.. వెంటనే ఆ కుర్రాడు బదులిస్తూ, తను నా అమమ్మ కాదు.. నా భార్య అంటూ బదులిచ్చాడు. దీంతో తల్లి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఏమి పాలుపోని కుటుంబ సభ్యులు ఏంటో లే అని లైట్ తీసుకున్నారు. అయితే ఆ కుర్రాడు మాత్రం అంతటితో ఆగకుండా తన పేరు మనోజ్ మిశ్ర అని చెప్పుకొచ్చాడు. ఎనిమిదేళ్ల క్రితం పొలానికి వెళ్లిన సమయంలో పాము కాటుతో మరణించానని చెప్పుకొచ్చాడు. తాను చనిపోయిన సందర్భంలో తన కూతురు (ఆర్యన్ తల్లి) గర్భవతిగా ఉందని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.
ఆ కుర్రాడు చెప్పిన మనోజ్ మిశ్ర మరెవరో కాదు ఆర్యన్ తాతే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆర్యన్ 4 ఏళ్ల వయసు నుంచే తన తల్లిని కూతురు అంటూ పిలవడం ప్రారంభించాడు. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా చెప్పిన విషయాలతో ఆర్యన్ నిజంగానే మళ్లీ జన్మించాడా అన్న వాదనలకు బలం చేకూరింది. గత జన్మలో జరిగిన సంఘటనలన్నింటినీ వరుస పెట్టి చెబుతుండడంతో ఊర్లో జనమంతా ఆర్యన్ ఇంటికి క్యూకట్టారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
0 Response to "Viral News"
Post a Comment