Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Guru powrnima

గురు పౌర్ణిమ లేదా వ్యాసపౌర్ణిమ యొక్క విశిష్టత . ఎందుకు జ‌రుపుకుంటారు?

Guru powrnima

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం.

ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!

మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, మనల్ని మరింత మెరుగుదిద్ది... మనలో జ్ణాన జ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించే వారే గురువులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం. మనకు మంచి చెడు గురించి చెప్పే గురువులు. అలాంటి గురువులను ఆరాధించడం కోసమే గురు పూర్ణిమ తిథిని నిర్ణయించారు పెద్దలు.

గురులో ‘‘గు’’ అంటే అంధకారం లేదా అజ్ణానం, "రు" అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం. గురువు అనే పదానికి అజ్ణానాన్ని తొలగించే వారు అని అర్థం. పురాణాల ప్రకారం, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడి కృషి మరువలేనిది. పంచమ వేదంగా పిలువబడే మహా భారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు.

గురువు ప్ర‌త్యేక‌త‌.

ఏ వ్య‌క్తికైనా మొద‌టి గురువు త‌ల్లే. ఆ త‌ర్వాత‌ మనకి జ్ఞానాన్ని అందించి... ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌. "గు" అంటే అంధ‌కారం లేదా అజ్ఞానాన్ని, "రు" అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం. అంటే గురువు అనే ప‌దానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది.

ఆదిగురువు వ్యాసుడే అప్ప‌టి వ‌ర‌కూ మౌఖికంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సాగిన వేద‌జ్ఞానాన్ని అంత‌టినీ ఒక్క‌చోట‌కు చేర్చి నాలుగు విభాగాలుగా విభ‌జించి వేద వాగ్మ‌యాల‌ను సామాన్యుడి చెంత‌కు చేరేలా చేయ‌డంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచ‌మ వేదంగా పేరు తెచ్చుకున్న మ‌హా భారతాన్ని మ‌న‌కు అందించిన వ్యాస భ‌గ‌వానుడు జ‌న్మించిన రోజు కాబ‌ట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస‌ పూర్ణిమగా పాటిస్తున్నారు.

వేదాల‌ను గ్రంద‌స్థం చేసిన వ్యాస మ‌హ‌ర్షి భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యులయొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

వేద వ్యాసుని ఇతి వృత్తం వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే.! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశ స్త్రాలు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జ‌యం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ త‌ర్వాతి కాలంలో మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే.! ఇంకా భాగవాతాన్ని రచించాడు.

వ్యాస పౌర్ణిమ రోజు పూజా విధానం కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మకాయలు ఉంచుతారు. శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తార‌ట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు.! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

హిందూ సంప్ర‌దాయాలు పాటించే భార‌త‌దేశం, నేపాల్, ఇంకా బుద్ధ‌, జైన సంప్ర‌దాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ రోజున ప్ర‌జ‌లు త‌మ ఆధ్యాత్మిక గురువుల‌ను స్మ‌రిస్తారు. పూజిస్తారు. బ‌హుమ‌తులు ఇస్తారు. గుడికి వెళ్లి ప్రార్థిస్తారు, దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై త‌మ‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు చేసే మ‌రో మార్గం ఉప‌వాసం ఉండ‌టం, గురువును పూజించి తాము మ‌రింత కాలం జీవించేందుకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం తీసుకుంటారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు.

వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Guru powrnima"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0