Timings for teachers! From today
టీచర్లకు టైమింగ్స్! నేటినుంచే
- ఉదయం 9.10గం.ల లోపు హాజరు నమోదు
- సెలవు అయితే ఉదయం 9లోపే అప్లయ్ చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నేటి నుంచి ఉదయం 9 గంటల 10 నిముషాలలోపే హాజరునమోదు చేయాలని, అలా చేయని వారి వివరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషనర్కు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం అటెండెన్స్ యాప్ నందు ఉద్యోగుల, ఉపాధ్యాయుల హాజరు నమోదుపై వెబెక్స్ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి నేటి నుంచి అమలు చేయాల్సిన పలు అంశాలను సూచించారు. అందరూ తప్పనిసరిగా ఉదయం 9.10 గంటల లోగా హాజరు నమోదు చేయాలని, సెలవు పెట్టిన వారు/డిప్యూటేషన్, స్పెషల్ డ్యూటీ అపై చేసిన వారు 9 గంటల లోగా అటెండెన్స్ ఆప్ నందు సెలవు కొరకు అప్లై చేయాలని సూచించారు. 9 గంటల తర్వాత సెలవు అపై చేయకపోతే ఆబ్సెంట్గా గా నమోదవుతారన్నారు. డిప్యూటేషన్, స్పెషల్ డ్యూటీ అపై చేసిన వారు వారు వెళ్లిన చోట తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలన్నారు. కొందరు ఉపా ధ్యాయులు రెండవ పూట లాగ్ అవుట్ అటెండెన్స్ వేయడం లేదని, పాఠశాల సమయం ముగియక ముందే లాగ్ అవుట్ చేస్తున్నారన్నారు. కాంప్లెక్స్ సమావేశాలలో కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొనే వారు సమయం ముగిసిన తర్వాత మాత్రమే లాగ్ అవుట్ చేయాలన్నారు. సెలవు కావలసిన వారు ఎంఈవోకు ఫోన్ చేసి, లేదా మెసేజ్ చేసి అనుమతి పొంది, ఆప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే సెలవు వినియోగించుకొవాలన్నారు. హాజరు నమోదు చేయుటలో ఎవరికైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే ఏంఈవో దృష్టికి తీసుకువెళ్ళాలని సూచించారు.
0 Response to "Timings for teachers! From today"
Post a Comment