Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet: Key decisions in AP Cabinet

 AP Cabinet: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు, 3 వేల వృద్ధాప్య పెన్షన్, విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్

యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పని చేసే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్టులలో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై కేబినెట్‌లో చర్చించారు.

యాభై ఎకరాల లోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీఐఐసీకి కేటాయింపుపై చర్చ జరిగింది. ఏపీ స్టేట్ సీసీ టీవీ సర్వైవలెన్స్ ప్రాజెక్ట్‌కి రూ.552 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడంపై కూడా చర్చించింది. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. 'ఆడుదాం ఆంధ్ర'పై కేబినెట్‌లో చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు 982 తాత్కాలిక పోస్టులు అదనంగా క్రియేట్ చేయడంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడ లోని రాయనపాడులో 20 సెంట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జగన్న శాశ్వత భు హక్కు, భూ రక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేయడంతో పాటు విశాఖ లైట్ మెట్రో కారిడార్‌కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జనవరి నుంచి అమలు కానున్న సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలకాంశాలకు ఆమోద ముద్ర లభించింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న లైట్ మెట్రో కారిడార్ డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఖర్చును 25 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ పరిమితి 5 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. ఈనెల 18వ తేదీన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్త కార్డులు జారీ చేయనున్నారు. జనవరిలో అమలు చేయనున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు కేబినెట్ ఆమోదించింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్‌ను జనవరి నుంచి 3 వేల రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. 

రాష్ట్రంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరు సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ మెట్రో డీపీఆర్ 4 రూట్లలో ప్రారంభించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశం జరుగుతుండగా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జి మరణవార్త తెలియడంతో కేబినెట్ 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet: Key decisions in AP Cabinet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0