Center clarity on validity of Rs.500 notes
రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫేక్ ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ సింబల్ కలికి రూ.500 నోట్లు చెల్లవని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతోంది.
దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తేల్చింది. స్టార్ (*) సింబల్ కలిగిన రూ.500 నోట్లు 2016 నుంచి చెలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఇవి ఫేక్ నోట్లు కావని ఆర్బీఐ ధృవీకరించిందని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లకు ఇదివరకే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరెన్సీ నోట్ నంబర్ ప్యానల్ లో స్టార్ (*) సింబల్ ముద్రించి ఉంటే అది రీప్లేస్ చేసింది లేదా రీప్రింట్ చేసిన నోటుగా గుర్తించాలని సూచించింది.
0 Response to "Center clarity on validity of Rs.500 notes"
Post a Comment