Jagan's government is another good news for the poor in AP.
ఏపీలో పేదలకు జగన్ సర్కార్ మరో శుభవార్త. ఈ నెల 27 నుంచి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతోంది.
ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతోంది.
పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ఈ రిజిస్ట్రేషన్లతో పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27 నుంచి పేదలకు ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి.
పేదలకు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని భూ పరిపాలన శాఖ ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు VROలు సంబంధిత సచివాలయాల్లో ప్రత్యక్షంగా విధుల్లో ఉండేలా చూడాలంది. బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలనీ, సర్వే, ప్లాట్ నంబర్లు, పేర్లు, ఇతర వివరాల నమోదులో తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలంది. నిధులు మంజూరు కాగానే పంపిస్తామనీ, ముఖ్యమంత్రి సందేశంతో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, నాణ్యత ఉండేలా చూడాలని ఆదేశించింది.
రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా YSR జగనన్న కాలనీలు నిర్మించింది. ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది.ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది.
పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది ప్రభుత్వం. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికీ, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదలు ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి.
ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తరపున VRO పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. అయితే, లబ్దిదారులు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయించుకోవాలి. లేదంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, దీనికి ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుంది.
0 Response to "Jagan's government is another good news for the poor in AP."
Post a Comment