Teachers into election duties
ఎన్నికల విధుల్లోకి టీచర్లు
- టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాల సేకరణ
- ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు రంగంలోకి దిగిన ఈసీ
- నేటి ఉ.11 గంటలలోగా వివరాలివ్వాలని ఆదేశం
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది.
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా పెడుతున్నారన్న వార్తలకు చెక్ పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులను తీసుకువచ్చేందుకు ప్రక్రియను ఆరంభించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా విద్యా శాఖ అధికారులు బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది వినియోగంపై పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల విధులకుసచివాలయ సిబ్బంది సరిపోరన్న అభిప్రాయాన్ని సీఈసీ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమాచార సేకరణకు ఆదేశాలిచ్చారు. సిబ్బంది కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోగా బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి అందజేయాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా ఉపాధ్యాయులను నియమించనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో అన్ని జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను సేకరిస్తూ ఆ సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి పంపుతున్నారు. దీనికోసం ప్రత్యేక ఫామ్ను కూడా రూపొందించి దానిలో బోధన, బోధనేతర బ్బంది వివరాలను నమోదు చేసి ఎన్నికల అధికారులకు పంపుతున్నారు.
0 Response to "Teachers into election duties"
Post a Comment