Show cause notices to three teachers
ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు
గుడివాకలంక జడ్పీ హైస్కూలులో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో
- ప్రతిరోజూ పాఠశాలల సందర్శన
- 4 గంటల తర్వాతే ఆఫీసుకు వెళతా..
- ట్యాబ్స్ బాధ్యత ఉపాధ్యాయులదే
- పాఠశాలల్లో డీఈవో అబ్రహం గారి ఆకస్మిక తనిఖీలు
‘పాఠ్యాంశం బోధించకుండానే దానిపై విద్యార్థు లకు పరీక్ష ఎలా పెడతారు? విద్యార్థుల వర్క్ బుక్లు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తే లోటుపాట్లు తెలుస్తాయి కదా. టీచర్లు వారికి నిర్దేశించిన జాబ్చార్ట్ను పాటిస్తున్నదీ, లేనిదీ ప్రస్తుతానికి పరిశీలిస్తాం.
ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 16 : ‘పాఠ్యాంశం బోధించకుండానే దానిపై విద్యార్థు లకు పరీక్ష ఎలా పెడతారు? విద్యార్థుల వర్క్ బుక్లు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తే లోటుపాట్లు తెలుస్తాయి కదా. టీచర్లు వారికి నిర్దేశించిన జాబ్చార్ట్ను పాటిస్తున్నదీ, లేనిదీ ప్రస్తుతానికి పరిశీలిస్తాం. మరో పదిరోజుల్లో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఎంత వరకు అవగాహన చేసుకున్నదీ క్షేత్రస్థాయిలోనే తెలుసుకుంటాం. ఈ తనిఖీలు టీచర్లను అకార ణంగా నిందించడానికి కాదు. వ్యవస్థను గాడిలో పెట్టడానికి మాత్రమే. ఇకమీదట రోజూ సా యంత్రం 4 గంటల తర్వాతే ఆఫీసుకు వెళతా. ఉదయం నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి..’ అని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం స్పష్టం చేశారు. ఏలూరు, భీమడోలు మండలాల్లోని పలు ప్రభు త్వ పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక జడ్పీ హైస్కూలులో విద్యార్థుల నోట్బుక్స్ను దిద్దని కారణంగా (కరెక్షన్) ఇద్ద రు ఇంగ్లీషు సబ్జెక్టు టీచర్లకు, స్కూలుకు ట్యాబ్ లను తీసుకురాని కారణంగా ఒక మ్యాథ్స్ టీచ రుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు డీఈ వో వెల్లడించారు. ఇక్కడి స్కూలులో మొత్తం 248 మంది విద్యార్థులుండగా టీచర్లు 14 మం ది ఉన్నందున వర్క్లోడ్ ఉండబోదన్నారు. నాలుగు రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఆగడాలలంక జడ్పీ ఓరియంటల్ హైస్కూ లులో నాడు–నేడు రెండో విడత నిర్మాణపనుల ప్రగతిని పరిశీలించారు. ఇక్కడ కూడా కొందరు విద్యార్థులు ట్యాబ్లను తీసుకురాకపోగా, మరి కొన్ని ట్యాబ్లు మరమ్మతుల నిమిత్తం సచివాల య డిజిటల్ అసిస్టెంట్కు అందజేసినట్టు హెచ్ ఎం సత్యనారాయణ డీఈవోకు వివరించారు. ట్యాబ్లు పనిచేయడానికి అవసరమైన ఇంట ర్నెట్ కనెక్షన్ స్కూలుకు లేక హాట్స్పాట్ను వినియోగించుకుంటున్నట్టు డీఈవో దృష్టికి తీసుకెళ్ళగా తక్షణమే ప్రైవేటు సంస్థల నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని సమ కూర్చుకోవా లని ఆదేశించారు. ప్రతీ శుక్రవారం ట్యాబ్స్ డేగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాటిస్తున్నప్పటికీ విద్యార్థులు వాటిని స్కూలుకు తీసుకురాకపో వడం హెచ్ఎం, ఉపాధ్యాయులదే బాధ్యత అని పేర్కొన్నారు. చెట్టున్నపాడు, కొక్కిరాయలంక ప్రాథమిక పాఠశాలలను కూడా తనిఖీ చేశారు.
0 Response to "Show cause notices to three teachers"
Post a Comment