Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Expensive goods in India: Imports from Pakistan to Bandh and India

భారతదేశంలో ఖరీదైన వస్తువులు: పాక్ నుండి దిగుమతులు బంద్, భారత్‌లో ధరలు పెరగనున్న వస్తువులు ఇవే

భారతదేశంలో ఖరీదైన వస్తువులు: పాకిస్తాన్ నుండి బంద్ మరియు భారతదేశానికి దిగుమతులు

 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఖరీదైన వస్తువులు | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. పాకిస్తాన్ ఈ దాడిని ఖండించడం లేదు, భారత ప్రభుత్వం తప్పిదాలే కారణమని పిచ్చి కూతలు కూయడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుంది. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు దౌత్య చర్యలు చేపట్టింది.

పాక్ ను ఇరుకున పెట్టేందుకు సింధు జలాల ఒప్పందంపై నిషేధం, వీసాలు రద్దు, అట్టారి, వాఘా సరిహద్దు మూసివేత నిర్ణయంతో దెబ్బకొట్టింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న SVES వీసాలు కలిగిన అధికారులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కూడా కలిగి ఉన్నారు. పాక్ పౌరులు ఏప్రిల్ 27 లోగా విడిచి వెళ్లాలి, ఎమర్జెన్సీ హెల్త్ వీసాలు కలిగిన వారు ఈ 29 లోగా భారత్ విడిచి వెళ్లాలని కోరుకుంటారు. భారతదేశంలో పాకిస్తాన్ అధికారిక X కూడా ప్రభుత్వం నిషేధించింది.

మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. భారత్ నిర్ణయాలు పాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భారత్, పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే పలు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతుంది. పాకిస్థాన్ నుంచి భారతదేశం పలు ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. సరిహద్దు మూసివేత, వాణిజ్యం రద్దుతో మార్కెట్ పై ప్రభావం చూపి పలు ఉత్పత్తుల ధరలు హెచ్చుతగ్గులు జరుగుతాయి.

ఆప్టికల్ లెన్స్: పాకిస్తాన్ కళ్లద్దాల లెన్సులు భారీగా ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉండటంతో ఆప్టికల్ లెన్స్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

డ్రై ఫ్రూట్స్: పాకిస్థాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారు పాక్. డ్రై ఫ్రూట్స్

సరఫరా నిలిచిపోతే వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే వ్యాపారులు చెబుతున్నారు.

రాక్ సాల్ట్: భారత్ రాక్ సాల్ట్ ను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీన్ని కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సైతం వినియోగిస్తారు. దాంతో రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఇతర ఉత్పత్తులు: భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్, ముల్తానీ మట్టి, పండ్లు, పత్తి, ఉక్కు, తోలు ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వీటి దిగుమతి లేక ధరలు పెరిగి సామాన్యుడిపై పడే అవకాశం ఉంది.

పహల్గామ్ లోని పర్యాటక ప్రాంతంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదం దక్షిణాసియాలో వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నందున భారత ప్రజలపై భారం పడనుంది. మరోవైపు పాక్ పరిస్థితి మరీ దారుణంగా ఉండనుంది. వారికి భారత్ నుంచి దిగుమతులు బంద్ అయి, ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు అంచనా వేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Expensive goods in India: Imports from Pakistan to Bandh and India"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0