Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

జ్యేష్ట మాసం శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి ని "నిర్జల ఏకాదశి" అని పిలుస్తారు.


24 ఏకాదశి లలో ఎంతో ప్రాముఖ్యత గల ఏకాదశి నిర్జల ఏకాదశి. దీనినే బీమా సేని ఏకాదశి అని కూడా అంటారు.  జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ఉపవసానంతరం శ్రీ మహా విష్ణువు కి భక్తీ శ్రద్దలతో పూజ కర్యాక్రమాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఏకాదశి చాల కటినమైనది అని కూడా అంటారు.

24 ఏకాదశిలు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ ఒక్క నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండడం వలన అన్ని ఏకాదశి ల ఫలం లబిస్తుంది అని చెబుతుంటారు. నిర్జల ఏకాదశి ని "పాండవ ఏకాదశి" అని, "భీమసేని ఏకాదశి" అని కూడా అంటారు. 

ధర్మరాజు ఒకరోజు "నిర్జల ఏకాదశి" గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు. 'జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ'ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు 'మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు. కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వత్రంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని ' కోరుతాడు. 

వ్యాసులవారు 'ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది. 

ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో 'ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు' అని తెలియజేశాడు.

ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం, దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు. 

'నిర్జల ఏకాదశి' ని విధి పూర్వకంగా చేసినవారు వైష్ణవపదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు.  

ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ గాయత్రి ఉపాసన విశేష ఫలితాన్ని ఇస్తుంది.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0