Census 2020
Census 2020
మీ ఇంట్లో ఎందరో మీరే చెప్పండి
ఎవరి సమాచారం వారే ఆన్లైన్లో నమోదు చేయొచ్చు
ఆ వివరాలతో ఇంటి వద్దకు జనగణన సిబ్బంది
పదేళ్లకోసారి జనాభా లెక్కలను ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తారు. గతంలో 2010-11లో దేశమంతా జనగణన జరిగింది. తిరిగి 2020-21లో పూర్తిచేయాలి. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి జనగణన 2010-11లో జరిగింది. రాష్ట్ర విభజన తరవాత తొలిసారి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా జనగణన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి జనగణన కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది. ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
జనగణనలో తొలి దశ కింద దేశవ్యాప్తంగా కట్టడాలు, ఇళ్లు, భవనాలు, పాకలు ఇలా ప్రతీ ఒక్కదానిని లెక్కిస్తారు. దీంతో సమాంతరంగా 2020 జూన్-సెప్టెంబరు మధ్యకాలంలో ప్రతీ కుటుంబం వివరాలను నమోదు చేస్తారు. వీటిని సేకరించే సమయంలోనే ప్రతీ కుటుంబంలో ఒకరి సెల్ఫోన్ నంబరును సేకరిస్తారు. మొబైల్ యాప్ ద్వారా కుటుంబ వివరాలను ఇస్తామని ఆసక్తి చూపేవారి సెల్ఫోన్ నంబరుకు యాప్ లింకును జనాభా లెక్కల శాఖ పంపుతుంది. ఈ లింకును 2021 జనవరిలో పంపే అవకాశాలున్నాయి. దానిని డౌన్లోడ్ చేసుకుని 2021 ఫిబ్రవరిలోగా కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి.
దేశమంతటా కొత్త జనాభా లెక్కల సేకరణ యజ్ఞం నిర్వహణకు రంగం
మీ ఇంట్లో ఎందరో మీరే చెప్పండి
ఎవరి సమాచారం వారే ఆన్లైన్లో నమోదు చేయొచ్చు
ఆ వివరాలతో ఇంటి వద్దకు జనగణన సిబ్బంది
ప్రత్యేక యాప్ను రూపొందించిన కేంద్రం జనాభా లెక్కల్లో తొలిసారి ప్రయోగం
దేశమంతటా కొత్త జనాభా లెక్కల సేకరణ యజ్ఞం నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. తొలిసారి ప్రజలు ఎవరికి వారే ఆన్లైన్ ద్వారా యాప్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయోగాత్మకంగా అవకాశం కల్పించబోతున్నారు. గతంలో జనగణన సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసేవారు. ఈసారీ అదే విధానం కొనసాగుతుంది. దాన్ని మరింత వేగంగా, పక్కాగా చేసేందుకు ప్రజల నుంచి నేరుగా ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్లో వారి కుటుంబ వివరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఎలా అంటే..
పదేళ్లకోసారి జనాభా లెక్కలను ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తారు. గతంలో 2010-11లో దేశమంతా జనగణన జరిగింది. తిరిగి 2020-21లో పూర్తిచేయాలి. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి జనగణన 2010-11లో జరిగింది. రాష్ట్ర విభజన తరవాత తొలిసారి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా జనగణన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి జనగణన కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది. ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
జనగణనలో తొలి దశ
జనగణనలో తొలి దశ కింద దేశవ్యాప్తంగా కట్టడాలు, ఇళ్లు, భవనాలు, పాకలు ఇలా ప్రతీ ఒక్కదానిని లెక్కిస్తారు. దీంతో సమాంతరంగా 2020 జూన్-సెప్టెంబరు మధ్యకాలంలో ప్రతీ కుటుంబం వివరాలను నమోదు చేస్తారు. వీటిని సేకరించే సమయంలోనే ప్రతీ కుటుంబంలో ఒకరి సెల్ఫోన్ నంబరును సేకరిస్తారు. మొబైల్ యాప్ ద్వారా కుటుంబ వివరాలను ఇస్తామని ఆసక్తి చూపేవారి సెల్ఫోన్ నంబరుకు యాప్ లింకును జనాభా లెక్కల శాఖ పంపుతుంది. ఈ లింకును 2021 జనవరిలో పంపే అవకాశాలున్నాయి. దానిని డౌన్లోడ్ చేసుకుని 2021 ఫిబ్రవరిలోగా కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి.
0 Response to "Census 2020"
Post a Comment