EPFO is good news for millions of employees and pensioners
లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈపీఎఫ్వో శుభవార్త!
ఈపీఎఫ్వో గుడ్ న్యూస్. ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు. కమ్యూటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సీబీటీ అంగీకారం తెలిపింది. దీంతో ఈపీఎస్ స్కీమ్కు మార్పులు చేయనున్నారు. దీంతో పెన్షనర్లకు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది.
ఈపీఎఫ్వో గుడ్ న్యూస్. ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు. కమ్యూటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సీబీటీ అంగీకారం తెలిపింది. దీంతో ఈపీఎస్ స్కీమ్కు మార్పులు చేయనున్నారు. దీంతో పెన్షనర్లకు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది.
- ఉద్యోగులకు తీపికబురు అందింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ తీసుకుంటున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) మార్పులకు అంగీకారం తెలిపింది. 15 ఏళ్ల తర్వాత కమ్యూటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ (సీవీపీ) పునరుద్ధరణ ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
- రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ‘కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే.. పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తోందనుకుంటే.. కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు రూ.29,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రతిపాదనకు ఆమోదం వల్ల పెన్షన్ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు.
- 2019 ఆగస్ట్ 21న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 6.3 లక్షల మంది పెన్షర్లకు ప్రయోజనం కలుగనుంది. పెన్షనర్లు దీని కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరిందని చెప్పుకోవచ్చు.
0 Response to "EPFO is good news for millions of employees and pensioners"
Post a Comment