changes in SBI charges
changes in SBI charges
ఎస్బీఐ ఛార్జీల్లో సమూల మార్పులు...
ఎస్బీఐ ఛార్జీల్లో సమూల మార్పులు...
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
- ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు.
- ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం...
- పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి.
- సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాలి.
- ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోవాలి.
- నిబంధంనలు పాటించని ఖాతాదారులపై ఛార్జీల మోత మోగనుంది.
- పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10,
- రూ.750 వరకు ఉంటే రూ.12.75,
- అంతకన్నా తక్కువగా ఉంటే రూ.15 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అధనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేయాలనుకుంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే డిపాజిట్ చేసేలా రూల్స్ మార్చారు.
- అది దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.
- మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా,
- అది కూడా కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా కూడా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు జీఎస్టీ కూడా అదనంగా కట్టాల్సిందేనంటూ బ్యాంక్ ప్రకటించింది.
- హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయదల్చుకుంటే గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.
- ఇక ఖాతాలో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించారు.
- రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంచే ఖాతాదారులు నెలకు 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.
- మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్డ్రా చేసుకోవచ్చంటూ బ్యాంకు అధికారులు ప్రకటించారు.
- ఇక హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు.
- నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
- వీటన్నితో పాటు ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.
0 Response to "changes in SBI charges"
Post a Comment