Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news to PF customers

పీఎఫ్‌ ఖాతాదారులకు తీపికబురు
పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీరేటును 8.65 పెంచుతూ నిర్ణయం
పెరిగిన వడ్డీరేట్లు త్వరలో చెల్లింపు!
కార్మిక మంత్రి గంగ్వార్‌

కేంద్ర కార్మికమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ భవిష్యనిధి(పీఎఫ్‌) ఖాతాదారులకు మంగళవారం తీపికబురు అందించారు.
2018-19వ సంవత్సరానికి గాను పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీరేటును 8.65 పెంచుతూ నిర్ణయం తీసుకున్న దరిమిలా త్వరలోనే అదే రేటు చొప్పున వడ్డీని లెక్కకట్టి సభ్యుల ఖాతాల్లో జమచేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఆరుకోట్ల మందికిపైగా ఖాతాదారులు ఈ ప్రయోజనాన్ని పొందుతారని మంత్రి సంతోష్‌ గంగవార్‌ ప్రకటించారు.
వాస్తవానికి ఫిబ్రవరి 21వ తేదీనాడే వడ్డీరేటు పెంపును ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఆమోదించిన విషయం గమనార్హం.
ఇప్పుడిక ఆర్థికమంత్రిత్వశాఖ ఆమోదముద్ర పడగానే పెంచిన రేటు ప్రకారం వడ్డీని ఆయా సభ్యుల ఖాతాల్లో జమచేస్తారు.
ఖాతాల నుంచి పీఎఫ్‌ మొత్తాలను ఉపసంహరించుకునే వారికి ఇదే రేటు చొప్పున వడ్డీని లెక్కకట్టి చెల్లిస్తారు.
2017-18 సంవత్సంలో పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీరేటు 8.55శాతంగా ఉన్న విషయం గమనార్హం.
ఈపీఎఫ్‌వో 2017-18లో సబ్‌స్క్రైబర్లకు 8.55 శాతం వడ్డీ రేట్లను అందించింది. ఇది ఐదేళ్ల కనిష్ట వడ్డీ రేటు. 2016-17లో వడ్డీ రేటు 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా ఉంది. 2013-14లో వడ్డీ రేటు 8.75 శాతంగా ఉంది. 2014-15లోనూ ఇదే వడ్డీ రేటు కొనసాగింది. 2012-13లో వడ్డీ రేటు 8.5 శాతం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news to PF customers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0