How many Eligible teachers are there in private schools
- ప్రైవేట్ పాఠశాలలలో లో అర్హులెందరు ?
- లక్షన్నర మంది టీచర్లలో అనర్హులే ఎక్కువ
- బీఎడ్ , డీఎడ్ , టెట్ అర్హతలను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు
- ప్రైవేటు స్కూళ్లలో టీచర్ గా బోధించాలంటే టెట్ తప్పనిసరి 2010 నుంచే అమలు చేయాల్సి ఉన్నా సీరియస్ గా తీసుకోని వైనం
- వచ్చే నవంబర్ నుంచి తేలనున్న 2019 - 20 విద్యా సంవత్సర లెక్కలు
- పాఠశాలలవారీగా టీచర్ల వివరాలు ఆధార్ తో అనుసంధానం
- డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు.
ఓ కార్పోరేట్ స్కూల్లో 850 మందికి పైగా విద్యా ర్థులు చదువుతున్నారు . అందులో దాదాపు 35 మంది టీచర్లు పని చేస్తున్నారు . వారిలో 10 మంది వరకు టీచర్లకు నెలవారీ వేతనం రూ . 10 వేల లోపే . కారణం వారిలో ఎక్కువ మందికి డీఎడ్ లేదా బీఎడ్ లేకపోవడం , ఇంకొందరు టెట్లో అర్హులు కాకపోవడం . ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో వందల స్కూళ్లలోవేల సంఖ్యలో పని చేస్తున్నట్లు విద్యాశాఖ అంచనా . ఐఐటీ చదువులు . . సింగిల్ డిజిట్ ర్యాంకులు అంటూ ఆకర్షనీయంగా ఎరవే స్థాయి ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలు . వేలకు వేలు ఫీజులు చెల్లించి పిల్లలను చేర్పిస్తే ఆశించిన చదువులు మాత్రం రావడం లేదు . ఎందుకలా అంటే . . అందులో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండరు . ఏదో ఇంటరో . . డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకుని టీచర్లుగా పనిచే స్తుంటారు . ఇలాంటి వారికి వేతనం కూడా రూ . 10 వేల లోపే ఉంటుంది . ఇక ఇలాంటివారికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది . ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేలా చర్యలు తీసు కుంటోంది . ఇందులో అక్రమాలకు తావులే కుండా ఆధార్ను అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు సూచించింది . ఆధార్ లింక్ . . . ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధార్ ఆధారిత టీచర్ల లెక్కలు ఇకపై ప్రైవేటు స్కూళ్లు చెప్పాల్సిందే . 2018 - 20 విద్యాశాఖ లెక్కల సేకరణలో ( యూ - డైస్ ) కచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాల్సిందే . విద్యార్థుల సంఖ్యకు , ఉపాధ్యాయులకు సంఖ్య సరిపోలాల్సిందే . ఉపా ధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉందా ? లేదా ? అడ్డగోలు ప్రవేశాలు చేపడుతున్నారా ? అన్నది తేల్చేందుకు , వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దమైంది . దీంతో అర్హతల్లేని టీచర్లకు చెక్ పడనుంది . అర్హులైన వారి తోనే బోధన చేపట్టేలా కార్యాచరణను అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది . వచ్చే నవంబర్ నుంచి చేపట్టనున్న 2019 - 20 యూ - డై స్లో ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ల సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని , అదీ ఆన్లైన్లో ఆధా 5తో లింక్ చేయడం డూప్లికేషన్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది . ఈ మేరకు రాష్ట్రంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది .
టెట్ అర్హత సాధిస్తేనే . . .
ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు సంబంధించి విద్యార్హతల వివరాలన్నింటిని సేక రించాలని కేంద్రం స్పష్టం చేసింది . ఇంటర్మీడి యెట్ , డిగ్రీ , పీజీ , డీఎడ్ , బీఎడ్ టెట్ అర్హతలు తదితర అన్ని వివరాలను సేకరించాలని పేర్కొంది . వీటిని ఆధార్ తో అనుసంధానం చేసి ఒక పాఠశాలలో పని చేసే టీచర్ మరో పాఠశా లలో లేకుండా చూసేందుకు డూపికేషన్ ) ఆన్లైన్లింకేజీ చేయాలని స్పష్టం చేసింది . 2010లో ఉపా ధ్యాయ అర్హత పరీక్షను ( టెట్ ) అమల్లోకి తెచ్చి నపుడు ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాల్లో బోధించా లంటే సదరు అభ్యర్థి టెట్లో అర్హత సాధించాలన్న నిబంధనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( ఎనసీటీఈ ) విధించింది . అయితే ప్రభుత్వాలు ఇన్నాళ్లు ఆ నిబంధన విషయంలో సీరియస్గా వ్యవహరించలేదు .
పక్కాగా చర్యలు చేపట్టినా . .
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు సుశిక్షితులైన వారే ఉండాలని కేంద్రం 2017 | ఆగస్టులో స్పష్టం చేసింది . 2019 , మార్చి 31 నాటికి పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్కరు ఉపా ధ్యాయ విద్యను అభ్యసించిన వారై ఉండాలని సూచించింది . గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసిం చేలా అవకాశం కల్పించింది . అయితే పాఠశాలల్లో వారు బోధిస్తున్నట్లు సర్టిఫై చేసిన వారికే ప్రవేశాలు కల్పించింది . మొదట్లో 3 , 905 మంది మాత్రమే అన్టెస్ట్ టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసినా , ఓపెన్ స్కూల్లో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత ఉందంటూ 17 వేల మందికిపైగా చదువుకున్నారు .
రికార్డుల్లో లేని వారు 33 వేలపైనే . .
పాఠశాలల రికార్డుల్లో లేకపోయినా టీచ కారులే పేర్కొంటున్నారు . ఇక టెట్లో అర్హత ర్లుగా పని చేస్తున్న వారు మరో 33 వేల మందికి సాధించని వారైతే 64 శాతం ఉన్నట్లు విద్యాశాఖ పైగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తు పరిశీలనల్లోనే తేలింది . ఈ పరిస్థితులన్నింటి న్నాయి . వారికి ఉపాధ్యాయ విద్య అర్హతలు నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు లేనందున రికార్డుల్లో చూపడం లేదు . మరోవైపు రంగంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ల మరికొంత మందికి తక్కువ వేతనాలు ఉండ లెక్కలను పక్కాగా చేపట్టాలని కేంద్రం టంతో వోచర్ పేమెంట్ల సరిపుచ్చుతున్నట్లు అధి నిర్ణయించింది .
0 Response to "How many Eligible teachers are there in private schools"
Post a Comment