Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Posting within the own zone for Secretariat employees.

 సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే పోస్టింగ్.
“ సచివాలయ ' ఉద్యోగులకు విధివిధానాలు ఖరారు .
మూడు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం.
Posting within the own zone for Secretariat employees.

గ్రామ , వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమి ంచాలని నిర్ణయించింది . ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా . . జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు . పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించబోతోంది . సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల ( డీఎస్సీ ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు . ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది . దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకుఆదివారం ఆదేశాలు జారీ చేశారు . ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్పీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు . వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు . వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు . ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు , మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు .

ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు.

 గ్రామ , వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన ( సోమవారం ) జిల్లా కేంద్రాల్లో అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు . జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . అపాయింటమెంట్ లెటర్ అంటే అభ్యర్ధి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని , సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు . 

సీఎం కార్యక్రమ షెడ్యూల్ 

విజయవాడలోని ' ఎ ' ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికై , కార్యక్రమానికి ఆహ్వానం ఆందినవారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది . ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు . సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు . ఇలా ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వీలుగా అధికారులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Posting within the own zone for Secretariat employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0