Readers' Club in Schools
ఇకపై పాఠశాలల్లో పాఠకుల క్లబ్
- విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేలా చర్యలు
- ఈనెల 30 వరకు సభ్యత్వ దరఖాస్తుల సేకరణ
- మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నేటి విద్యార్థులు దృశ్య రూపంలో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకే ఆసక్తి చూపు తున్నారు . దీంతో వార్తా పత్రికలు , కథలు పుస్త కాలు చదవడం పై వారికి రోజురోజుకూ ఆసక్తి సన్నగిల్లుతోంది . ఈ నేపథ్యంలో పాఠ్యపుస్త కాలు చదివేందుకు సైతం వెనకడుకు వేస్తు న్నారు . అలాగే మాతృభాషలో ఉన్న కథలను చదివేందుకు ముందుకు రావడం లేదు . దీంతో విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వ సర్వేల్లో వెల్లడైంది . దీంతో విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం కోసం రీడర్స్ ( పాఠకుల ) క్లబ్ ఏర్పాటు చెయ్యా లని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది . జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు మార్గదర్శకాలు విడు దల చేశారు . ఆ వివరాలు తెలుసుకుందాం . . . వార్షిక ప్రణాళికలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ , భారత సమగ్ర శిక్ష వార్షిక ప్రణాళిక ఆమోదం మేరకు , ఈ రీడర్స్ క్లబ్ ను నేషనల్ బుక్ ట్రస్ట్లో భాగమైన నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటిరేచర్ సహకారంతో ప్రాథమిక , ప్రాథమికోన్నత , ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాల ల్లో ఏర్పాటు చెయ్యనున్నారు . పిల్లల్లో సాహిత్యా భిలాషను పెంపొందించేందుకు 1995లో ' నేష నల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ ' సంస్థను స్థాపించారు . ఈ సంస్థ దేశంలోని ఉపాధ్యాయు లు , లైబ్రేరియన్లు , సంపాదకులు , రచయితలు , చిత్రకారులకు వర్క్ షాపులు ఏర్పాటు చేసి పిల ల్లో పఠన అలవాటును ప్రోత్సహించే అంశాలపై వారిని శిక్షణ ఇస్తారు . దీనిలో భాంగానే ఈ సంస్థ సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని పాఠశా లల్లో రీడర్స్ క్లబ్ ను ఏర్పాటు చేయనున్నారు .
రీడర్స్ క్లబ్ బులెటిన్ ఈ కార్యక్రమం ఉద్యమంగా చేపట్టడానికి రీడర్స్ క్లబ్ బులెటిన్ పేరుతో ఒక ద్విభాషా త్రైమాసిక పత్రికను ఆ సంస్థ ప్రచురిస్తోంది . పిల్లలు , ఉపాధ్యాయులు వారి రచనలు , అభి ప్రాయాలు ఈ పత్రికకు పంపేలా అధికారులు ప్రోత్సహించాల్సి ఉంటుంది . ఈ సమగ్ర శిక్ష రీడర్స్ క్లబ్లో సభ్యులుగా ఉన్న పాఠశాల న్నింటికీ నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ నుంచి ఉచిత బులిటెన్ ఈ - కాపీ రూపంలో పంపుతారు . ఈ కాపీని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవచ్చు . జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ రీడర్స్ క్లబ్కు సంబంధించిన సభ్యత్వ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపా ధ్యాయులు సేకరించి క్లబ్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మండల వనరుల కేంద్రాని చేర్చి , మండల వనరుల కేంద్రాల నుంచి ఈ - మెయిల్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచ రకు ఈనెల 30వ తేదీలోపు పంపేలా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోనున్నారు .
నిర్వహించే కార్యక్రమాలు
- కథలు చెప్పించడం ,
- రాయించడం
- పద్యాలు పాడించడం
- కథలు చెప్పడానికి అనువైన సమయాన్ని కేటాయించుకోవడం
- పుస్తక సమీక్ష నిర్వహించడం
- కథ లేదా కవితలను వివరించడం
- గోడపత్రికను నిర్వహించడం
- పిల్లల చేత పత్రికను రాయించడం
- ఆయా పాఠశాలల పరిధిలో ముఖ్యమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం
- పుస్తకంలో ఎంచుకున్న పదాన్ని లెక్కించడం
- పదాల క్రమబద్దీకరణ కథను తీసుకుని , వాటి ఆధారంగా ప్రదర్శించడం
- చిరిగిన వార్తా పత్రికలు , మ్యాగజైన్స్ , పుస్త కాల పై పెయింటింగ్ చేయించడం
- రచయితల పుట్టిన రోజులను జరపడం
- కవులు , రచయితలను కలవడం పుస్తకాలతో సెల్ఫీ దిగడం
- పాఠశాలలోని లైబ్రరీ పుస్తకాలను అక్షర క్రమంగా అమర్చడం
- కాగితపు ముక్కలను మడతలు పెట్టడం ద్వారా కృత్యాలు చేయడం
- పాఠశాల గ్రంథాలయాలను అందుబాటు లోని వస్తువులతో ఇంద్రధనస్సులోని 7 రంగులతో అలంకరించడం
- పుస్తకాల్లోని చిత్రాల ఆధారంగా కథలు రాయడం |
- లైబ్రరీలో ఉన్న పుస్తకానికి కొత్త శీర్షికలను సూచించడం
- కొత్త పదాలను నిఘంటువు సాయంతో చర్చిండం
- విభిన్న సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయడం
0 Response to "Readers' Club in Schools"
Post a Comment