Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills
Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills.
- ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్ణయం.
- తొలుత తెలంగాణలో క్రమంగా ఏపీలో కూడా విస్తరించాలని సంస్థ ప్రణాలిక..
- వారంలో రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాద్యం యులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీ సెస్
( టీసీఎస్ ) నిర్ణయించింది . విద్యాబోధనను మరింత ఆకర్షణీ యంగా , సమర్ధంగా చేయడంతో పాటు పాఠశాల నిర్వహణ విదు లను సులభతరం చేయడం వల్ల బోధన పైనే దృష్టి సారించేందుకు ఉపాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులకు వీలవుతుందని సంస్థ పేర్కొంది . ప్రభుత్వంతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సీఐఐ ) ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది . తొలుత తెలంగాణా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడు తుండగా , క్రమంగా అంధ్రప్రదేళకు కూడా విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక . వారంలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉంటుంది . పాఠ్యాంశాల బోధన ( థియరీ ) తో పాటు ల్యాబ్లో ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉంటుంది . ఇందుకోసం 100 మంది వాలం టీర్ల ( సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ) ను టీసీఎస్ కేటాయిస్తోంది . మొత్తం 500 మంది వాలంటీర్లు కావాలి కనుక ఇతర సాఫ్ట్ వేర్ సంస్థలనూ భాగస్వాములను చేస్తామని పేర్కొంది . తొలివిడతగా హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లోని 61 మంది ఉపాధ్యాయులకు శిక్షణను శనివారం హైదరాబాద్లోని టీసీఎస్ సీనరీ పార్కులో ప్రారంభించారు . ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు 5000 మంది ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలన్నది తమ ప్రణాళిక అని టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి . రాజన్న తెలిపారు . రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠ శాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని , ప్రతి పాఠశాల నుంచి ఆసక్తి కలిగిన చురుడైన ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులదేనని వివరించారు . హైదరాబాద్ సమీపంలోని వారికి టీసీఎస్ ప్రాంగణంలో , ఇతర ప్రాంతాల వారికి ఆ సమీప ఇంజినీరింగ్ కళాశాలలు , ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసం స్థలను ఇందుకోసం వినియోగిస్తామన్నారు . వీరితో అనుసంధాన బాధ్యతలను సీఐఐ చూసుకుంటుంది .
ఈ అంశాల్లో శిక్షణ
ఎంఎస్ ఆఫీస్లోని వర్డ్ , పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎక్సెల్షీట్తో పాటు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మెయిల్ ద్వారా ఎలా సమర్థంగా రాయాలో తెలుపుతారు . విద్యార్ధులకు సిలబస్ ప్రణాళిక , టైమ్టేబుల్ , హాజరు , మార్కుల పట్టికలు , పాఠశాల సిబ్బంది వేతన పట్టికలు రూపొందించడం బాగా సులువవుతుందని వివరించారు .
500 మందికి పీహెచ్డీ ప్రాయోజితం
దేశంలో డాక్టరేట్ల సంఖ్య పెంచేందుకు , తద్వారా పరిశోధనల వృద్దికి టీసీఎస్ కట్టుబడి ఉందని రాజన్న తెలిపారు . 2010లో తమ సీఈఓ ప్రకటించిన ఈ పథకం కింద వరంగల్ ఎన్ఐటీ నుంచి ఇద్దరు , హైదరాబాద్ ఐఐఐటీ నుంచి 22 మంది వినియోగించుకున్నా రని వివరించారు . తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోని ఆరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు . వారికి సైపు డితో పాటు పేపర్ ప్రెజెంటేషన్ కోసం సంబంధిత సమావేశాలకు హాజరయ్యేందుకు ఖర్చులను కూడా టీసీఎస్ భరిస్తుందన్నారు .
స్వచ్ఛభారత్ నిధుల్లో అధికం మనకే
ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కింద ఆడపిల్లల పాఠ శాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తమ గ్రూప్ కేటాయించిన రూ . 100 కోట్లలో అధికశాతం నిధులను తెలుగు రాష్ట్రాలకే వినియోగం చినట్లు రాజన్న తెలిపారు . 1500 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయి , నిర్వహణ బాధ్యతలు కూడా తామే చేపట్టినట్లు వివరించారు .
0 Response to "Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills"
Post a Comment