Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education department makes efforts to change the cover of schools

పాఠశాలల ముఖచిత్రాల మార్పునకు విద్యాశాఖ కసరత్తు..

  • పాఠశాలల ముఖచిత్రాల మార్పునకు విద్యాశాఖ కసరత్తు.
  • మౌలిక వసతులు కల్పనకు ప్రణాలిక.
  • నాడు-నేడు పేరిట రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి చర్యలు.

రాష్ట్రంలోని పాఠ శాలల ముఖచిత్రాలను మార్చాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా విద్యాశాఖ అధికా రులు కసరత్తు ప్రారంభించారు . ఇందుకోసం ఇ ప్పటికే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ముఖ చిత్రాలను సేకరించి ఒక యాప్లో పొందుప రిచారు . రాష్ట్రంలోని పాఠశాలలన్నింటికీ కలిపి దాదాపు పది లక్షలకు పైగా ఫొటోలను సేకరించి డేటా సిద్ధం చేశారు . ' నాడు - నేడు ' పేరిట రాష్ట్రంలోని 44 వేల 512 పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది . తొలివి డతలో 15 వేల 410 పాఠశాలలను ఎంపిక చేసి “ నాడు - నేడు ' కింద 9 రకాల కనీస వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది . ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రూ . 33 వేల కోట్ల బడ్జెట్లు కేటాయించడంతో పాటు అసెం బ్లీలో సైతం పాఠశాలల ముఖచిత్రాలను మార్చి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఇటీవల విద్యాశాఖముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు , సివిల్ వర్క్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు . తొలి విడతలో అభివృద్ధి చేయాల్సిన 15 వేల 410 పాఠశాలల్లో ఉన్న వ సితులేంటి , అదనంగా కల్పించాల్సిన వసతులేమి టనే ఆంశాలపై చర్చించారు .

 మార్చినాటికి మొదటి విడతపూర్తి 

ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యేలోగా తొలివిడతలో అభివృద్ధి చేయాలని సంకల్పించిన పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిం చేందుకు విద్యాశాఖ నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది . వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని , తద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలనే లక్ష్యాన్ని విద్యాశాఖ నిర్దేశించుకుంది . విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ సైతం పాఠశాలల ముఖచిత్రాలను మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రకటించారు . ఈ నేపథ్యంలో మార్చి 14 నాటికి మొదటి విడతలో ముఖచిత్రాలు మార్చాలని నిర్ణయించిన 15 వేల 10 పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు . ఆలాగే ఈ పాఠశాలల్లో పంచాయతీరాజ్ , మున్సిపల్ , ట్రైబల్ వెల్ఫేర్ , సోషల్ వెల్ఫేర్ , వీసీ వెల్పేర్ తదితర విభాగాల ఆధ్వర్యంలో నడిచే అన్ని పాఠశాలలు తొలి విడత అభివృద్ధి చేయాల్సిన వాటిలో ఉండేలా చేశారు . 

" పేరెంట్ కమిటీల పర్యవేక్షణలో . . అభివృద్ధి

 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పేరెంట్ కమిటీల భాగస్వామ్యం కల్పించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది . ఈ నెల 28న పేరెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించనుండటంతో . . పూర్తయిన వెంటనే ప్రతి ఒక్క పాఠశాలలో కమిటీలతో విద్యాశాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు . ఎక్కడిక్కడ స్థానిక అవసరాలను బట్టి నిధులు కేటాయించడంతో పాటు త్వరితగతిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్ట నున్నారు . ' నాడు - నేడు ' లో పేరెంట్ కమిటీల భాగస్వామ్యం వల్ల బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన తీసుకురావాలని ముఖ్యమంత్రి గతంలో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు . పేరెంట్ కమిటీలతో పాటు పూర్వ విద్యార్థు లను సైతం పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాము లను చేయాలని విద్యాశాఖ అధికారులు భావి స్తున్నారు . ఇందుకోసం ఇటీవల సర్వ శిక్షా అభి యాన్ రాష్ట్ర కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ నేతృత్వంలో ఎస్పీడీ చినవీరభద్రుడు , చీఫ్ ఇంజనీర్ కె . శ్రీనివాసరావు , సివిల్ వర్క్ ఇంజనీర్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సమావేశం| నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులు కల్పించేందుకు అవసరమైన బడ్జెటపై చర్చించడంతో పాటు , చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా చర్చించారు . మరోవైపు విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామ , మండల , జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు . ఒక పక్కన అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తూనే . . మరోపక్క టీచర్లకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణనివ్వడం , జనవరి నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టడం వంటివి పూర్తి చేసివచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది . అలాగే రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకు తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్దమవుతున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education department makes efforts to change the cover of schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0