The most obvious of which is not yet on the tenth grade examination system
- టెన్త్ పరీక్షల విధానంపై అయోమయం !
- విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా లేని స్పష్టత
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపని వైనం.
- టీచర్లు , విద్యార్థుల్లో గందరగోళం
విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటుతున్నా పదో తరగతి పరీక్షలను ఈసా ఎలా నిర్వహిస్తారో విద్యా శాఖ ప్రకటించకపోవడంపై టీచర్లు , విద్యార్థుల్లో విస్మయం వ్యక్తమవుతోంది . ఇప్పటివరకు పరీక్షల విధానం ఖరారు కాకపోవడంతో పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు . మరోవైపు ఎలా చదవాలో అర్ధం కాక విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు .
కార్పొరేట్ అక్రమాలతో ఇంటర్నల్ మార్కులు రద్దు
ఈ ఏడాది ( 2019 మార్చి / ఏప్రిల్ ) వరకు ప్రశ్నపత్రానికి 80 మార్కులు , ప్రాజెక్టులు , ఇతర కృత్యాలకు 20 ఇంటర్నల్ ( అంతర్గత ) మార్కులు కేటాయించి పదో తరగతి పరీక్షలు నిర్వహించారు . అయితే . . ఈ ఇంటర్నల్ మార్కులు కేటాయింపులో కార్పొరేట్ , ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేస్తున్నారని . . ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి . దీంతోపాటు ప్రైవేటు పాఠశాలలు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి . దీంతో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జూన్లో జీవో జారీ చేసింది .SCERT ప్రతిపాదనలు ఇవి .
- టెన్త్ లో 20 శాతం అంతర్గత మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసినందున హిందీ , సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెలు 100 మార్కులకు ( 50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు ) ఉంటుంది .
- ప్రతి పేపర్లో నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు .
- ఇంతకుముందు ప్రతి పేపర్లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా బీట్ పేపర్ ఉండగా తాజాగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు .
- వాటి స్థానంలో ఏకవాక్య సమాధానాల ప్రశ్నలు ఇవ్వనున్నారు . . గతంలో మాదిరిగానే 2 , 3 గంటలు పరీక్ష రాయడానికి , 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఇవ్వనున్నారు .
- సంస్కృతం , హిందీ పేపర్లు 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు , ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయమిస్తాడు .
- ఆయా సబ్జెక్టుల రెండు పేపర్లలో ప్రతి పేపర్లోనూ 17.5 మార్కులు రావాలి .
- ఇలా రెండు పేపర్లకు కలిపి కనీసం 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా పరిగణిస్తారు .
- ఈ మేరకు మార్కుల మెమోల్లో కూడా మార్పులుంటాయి . గ్రేడింగ్ విధానం యధాతధంగా ఉంటుంది.
- కాపీయింగను నివారించడానికి ఇంటర్మీడియట్ తరహాలో 2 నుంచి 16 పేజీలుండే బుక్లెట్ ను అందించాలని ప్రతిపాదించారు .
నెల క్రితమే బ్లూ ప్రింట్ ఖరారైనా .
- ప్రభుత్వ జీవోతో రాష్ట్ర విద్యా పరిశోధన క్షణ మండలి
- ( SCERT) నెల క్రితమే పరీక్షల విధానాన్ని మాదిరి ప్రశ్నపత్రాలను , బ్లూప్రింటను రూపొందించింది .
- దీన్ని పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి పంపించి ఆమోదం పాందీ . . జీవో విడుదల చేయించాలి .
- ఎస్ సీఈఆర్టీ ప్రతిపాదనలు సమర్పించినా పాఠశాల విద్యా శాఖ మాత్రం ప్రభుత్వానికి పంపడానికి మీనమేషాలు లెక్కిస్తోంది .
- వేసవి సెలవుల్లోనే ప్రకటించాల్సిన పరీక్షల విధానాన్ని నాలుగు నెలలైనా ఖరారు చేయకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు గత రెండు నెలల నుంచే నిరసన వ్యక్తు చేస్తున్నాయి .
- అయినా అధికారులు పట్టించుకోవడం లేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
కొత్త ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు.
- ఎస్ సీఈఆర్టీ ప్రతిపాదించిన టెన్త్ పరీక్షల ప్యాట్రన్ పై టీచర్ల సంఘాల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ,
- రెండు పేపర్లున్న సబ్జెక్టుల్లో ప్రతి పేపర్లోనూ 17 . 5 మార్కులు రావాలనే నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతారని అంటున్నాయి .
- అదేవిధంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల నేపథ్యంలో బిట్ పేపరను ఉంచాలని కోరుతున్నాయి .
0 Response to "The most obvious of which is not yet on the tenth grade examination system"
Post a Comment