Corporate Elements for Public Schools ..
- ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ సొబగులు..
- మనబడి నాడు-నేడు పేరుతో కార్యక్రమం..
- మొత్తం తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించాలని యోచన
- మూడేళ్లలో అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు
- జిల్లాలో మొదటి ఏడాది 1 , 240 పాఠశాలల ఎంపిక
- ఏడాదికి రూ . 200 కోట్ల నిధులు వచ్చే అవకాశం
పిల్లలను కచ్చితంగా చదివించేలా ' అమ్మఒడి ' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . . ఇప్పుడు ప్రభుత్వ పాఠ శాలల్లోనే చదివించేలా చర్యలకు ఉప క్రమించారు . కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా . . ఇంకా చెప్పాలంటే అంతకు మించిన సౌకర్యాలను కల్పించేందుకు నిర్ణయించారు . జిల్లాలో మొదటి ఏడాది 1 , 240 ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించను న్నారు . మన బడి నాడు - నేడు శీర్షికన చేపట్టబోయే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏకంగా రూ . 200 కోట్ల చొప్పున వచ్చే ఆవకాశం ఉందని అధికారులుఅంచనా వేస్తున్నారు . ఈ విధంగా కార్యక్రమం అమలు అందిన తర్వాత గతంలో పాఠశాల ఏ విధంగా ఉండే ది ? ఇప్పుడు ఎలా ఉందనే అంశాన్ని ఫొటోలతో సహా ప్రజల ముందు ప్రభుత్వం ఉంచనుంది . అంతేకా కుండా పాఠశాలల్లో సౌకర్యాల కల్ప నలో స్థానికుల సహకారం తీసుకో వడం ద్వారా నాణ్యత విషయంలో రాజీ లేకుండా చూడాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
9 సౌకర్యా లతో . . . .
- ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు ఏమిటనే అంశాలపై ఇప్ప టికే ప్రభుత్వం ఒక అధ్యయనం చేయించింది . ఇందులో భాగంగా 8 రకాల అంశాలను గుర్తించింది . అవి . . .
- 1 . నిరంతరం నీటిసౌకర్యంతో టాయిలెట్ల నిర్మాణం
- 2 . పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు , ట్యూబ్ లైట్ల ఏర్పాటు
- 3 . తాగునీటి సరఫరా
- 4 . ఉపాధ్యాయులకు , విద్యార్థులకు ఫర్నిచర్ సౌకర్యం
- 5 . మొత్తం క్యాంపు పెయింటింగ్
- 6 . చిన్న , పెద్ద మరమ్మతులు
- 7 . బ్లాక్ బోర్డులు
- 8 . అదనపు తరగతి గదుల నిర్మాణం
- 9 . కాంపౌండు గోడ . . .
- ఈ సౌకర్యాలు గతంలో ఉన్న పాఠశాలలో కూడా . . సమస్యలు వెంటనే వస్తున్నాయి . పాఠశాల కాంపౌండు గోడ నిర్మించిన ఏడాదికే చిన్నపాటి గాలివానకే కూలిపో తోంది . ఇక తరగతుల నిర్మాణం పూర్తయితే రెండేళ్లల్లోనే పైకప్పు ఊడిపోతోంది . ఫ్లోరింగ్ 6 నెలల్లోనే గుంతలు పడి టైల్స్ పగిలిపోతున్నాయి . అందువల్ల కొత్తగా చేపట్టబోయే నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొంటున్నారు . ఏయే పనికి ఏ రకమైన నాణ్యత కలిగిన బ్రాండెంట్లను వాడాలనే అంశాన్ని కూడా నిర్దేశించను న్నారు . ఫలితంగా ఈ సౌకర్యాలు కల్పించిన తర్వాత కొన్నేళ్ల పాటు పనులు గుర్తుండిపోయేలా ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది .
మూడేళ్లల్లో . . :
జిల్లాలో మొత్తం 3 , 834 ప్రభుత్వ పాఠశా లలు ఉండగా . . వీటన్నింటిలో తొమ్మిది సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను రచించింది . ఇందులో భాగంగా మొదటి ఏడాది 1 , 240 పాఠశాలల్లో తొమ్మిది సౌకర్యాలను కల్పించనున్నారు . ఇందుకోసం ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయనే వివరా లతో కూడిన ఫొటోలను అప్లోడ్ చేస్తారు . పనులు పూర్తి చేసిన తర్వాత ఏ విధంగా మార్పు చెందాయనే అంశాన్ని కూడా పేర్కొంటూ ఫొటోలను అప్లోడ్ చేస్తారు . వీటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ మనబడి నాడు నేడు శీర్షికన అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . అంతేకాకుండా ఈ పనుల్లో కూడా స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం స్పష్టంగా అధికారు లకు ఆదేశాలు జారీచేసింది . మొదటి విడతలో చేపట్టబోయే పనుల్లో 252 ప్రాథమిక పాఠశాలలు , 111 ప్రాథమికోన్నత పాఠశాలలు , 122 ఉన్నత పాఠశాలల్లో పనులను ఆంధ్రప్ర దేశ్ విద్యాసంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ( ఏపీఈడ బ్ల్యుఐడీసీ ) చేపట్టనుండగా . . 433 పీఎస్ , 172 యుపీఎస్ , 150 హెచ్ఎస్ పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ ( ఎస్ఎస్ఏ ) పనులు నిర్వహించనుంది . మొత్తం మీద 685 ప్రాథమిక పాఠశాలలు , 283 ప్రాథమికోన్నత పాఠశాలలు , 272 ఉన్నత పాఠశాలలలు కలిపి 1 , 240 పాఠశాలలకు సకల హంగులు సమకూరనున్నాయి . మరోవైపు ఇప్పటికే జిల్లాలోని హాస్ట క్లల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు జిల్లా కలెక్టర్ల చేతికి ప్రత్యేకంగా రూ . 15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది . ఈ నిధులతో ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి .- ప్రతి క్లాస్ రూంలో నాలుగు ఫ్యాన్లు , నాలుగు ట్యూబ్ లైట్లు
- ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్
- ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక వాష్ కైసిన్
- దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్ సదుపాయం
- విద్యా ర్థినుల ప్రత్యేక అవసరా లకు అనుగుణంగా ( న్యాప్కిన్స్ మార్చుకునేందుకు వగైరా ) టాయిలెట్ల నిర్మాణం ! !
- అన్ని పాఠశాలల భవనాలకు కొత్తగా పెయింటింగ్ . . .
- ఈ విధంగా అన్ని హంగు లతో ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఏమవుతుంది ?
- ప్రతి ఇంట్లో విద్యా వెలుగులు విరజిమ్మడం ఖాయం .
- రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది .
- ఇందుకోసం ' మనబడి నాడు - నేడు ' కార్యక్ర మానికి శ్రీకారం చుడుతోంది .
0 Response to "Corporate Elements for Public Schools .."
Post a Comment