Employees of public sector banks on strike on September 22 Opposition to the merger of banks
ఈ నెల 22న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల విలీనంపై వ్యతిరేకత
సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు
ఉపాధి పోతుంది, ఉద్యోగ భద్రత ఉండదన్న సంఘాలు
బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఈ) నేతలు తెలిపారు.
కాగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. కాగా, విజయవాడలో ఆంధ్రా బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనం ఆపాలని, ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.
కాగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. కాగా, విజయవాడలో ఆంధ్రా బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనం ఆపాలని, ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.
0 Response to "Employees of public sector banks on strike on September 22 Opposition to the merger of banks"
Post a Comment