About 10 th Class New modal question paper
ముఖ్యాంశాలు:
పదో తరగతి ప్రశ్నాపత్రం మోడల్ ను మారుస్తూ విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన బ్లూప్రింట్ తో కార్పొరేట్ బట్టీలకు కాలం చెల్లినట్లే కానుంది . విద్యార్థులను బట్టీ పట్టించడం ద్వారా జీపీఏలు పెంచాలనుకుంటే ఇంక కుదరనట్లే . కొత్త మోడల్ ప్రకారం చాయిస్ లేని ప్రశ్నలు 28 ఉండటం వల్ల ఎక్కువ సిలబస్ ను కవర్ చేయాల్సి ఉంటుంది . అందువల్ల ముఖ్యమైనవి మాత్రమే బట్టి కొట్టిద్దామనుకుంటే ఏ మాత్రం కుదరదు . ఇప్పటి వరకు పదికి పది , పదికి తొమ్మిదిపైగా జీపీఏలు వచ్చాయంటూ ప్రకటించుకుంటున్న మెజారిటీ కార్పొరేట్ , ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడకుండా తయారైంది .
ఈ ప్రశ్నాపత్రం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా , వారిలోని విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించేలా , అవగాహనా శక్తిని మేల్కొల్పేలా ఉందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు . అయితే ఈ ప్రశ్నాపత్రం విద్యాసంవత్సరం మధ్యలో తేవడం వల్ల విద్యార్థులపై ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి . విద్యావ్యవస్థలో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టడం మంచిదే అయినా కీలకమైన పదో తరగతి విషయంలో ఇంత గోప్యత , ఇంత ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నల్ మార్కులను తొలగించడం తో పాటు ప్రశ్నాపత్రం ప్యాటర్న్ ను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 15న నూతన మోడల్ ను ప్రకటించింది . అయితే ఈ మార్పుపై ముందునుంచే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ ప్రశ్నాపత్రం మోడల్ రూపకల్పన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు , విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పట్టించుకో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి .
- కార్పొరేట్ రుద్దుడుకు కాలం చెల్లు
- జీపీఏల జిమ్మిక్కులు బంద్
- మింగుడు పడని ప్రభుత్వ నిర్ణయం
- బట్టి పట్టి పది గట్టెక్కడం కష్టమే
- నూతన మోడల్ పై భిన్నస్వరాలు
- చాయిస్ తొలగించడంతో ఒత్తిడి
- అవగాహన కల్పించి అమలు చేస్తే ప్రయోజనం
పదో తరగతి ప్రశ్నాపత్రం మోడల్ ను మారుస్తూ విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన బ్లూప్రింట్ తో కార్పొరేట్ బట్టీలకు కాలం చెల్లినట్లే కానుంది . విద్యార్థులను బట్టీ పట్టించడం ద్వారా జీపీఏలు పెంచాలనుకుంటే ఇంక కుదరనట్లే . కొత్త మోడల్ ప్రకారం చాయిస్ లేని ప్రశ్నలు 28 ఉండటం వల్ల ఎక్కువ సిలబస్ ను కవర్ చేయాల్సి ఉంటుంది . అందువల్ల ముఖ్యమైనవి మాత్రమే బట్టి కొట్టిద్దామనుకుంటే ఏ మాత్రం కుదరదు . ఇప్పటి వరకు పదికి పది , పదికి తొమ్మిదిపైగా జీపీఏలు వచ్చాయంటూ ప్రకటించుకుంటున్న మెజారిటీ కార్పొరేట్ , ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడకుండా తయారైంది .
ఈ ప్రశ్నాపత్రం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా , వారిలోని విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించేలా , అవగాహనా శక్తిని మేల్కొల్పేలా ఉందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు . అయితే ఈ ప్రశ్నాపత్రం విద్యాసంవత్సరం మధ్యలో తేవడం వల్ల విద్యార్థులపై ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి . విద్యావ్యవస్థలో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టడం మంచిదే అయినా కీలకమైన పదో తరగతి విషయంలో ఇంత గోప్యత , ఇంత ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నల్ మార్కులను తొలగించడం తో పాటు ప్రశ్నాపత్రం ప్యాటర్న్ ను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 15న నూతన మోడల్ ను ప్రకటించింది . అయితే ఈ మార్పుపై ముందునుంచే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ ప్రశ్నాపత్రం మోడల్ రూపకల్పన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు , విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పట్టించుకో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి .
రెండున్నర గంటల్లో 33 ప్రశ్నలు
- పదో తరగతి నూతన ప్రశ్నాపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి .
- వీటిలో వ్యాసరూప ప్రశ్నలకు మినహా వేటికీ చాయిస్ లేదు .
- ఆబ్జెక్టివ్ టైప్ , వెరీ షార్ట్ టైప్ , షార్ట్ టైప్ ప్రశ్నలు మొత్తం రాయాల్సి ఉంటుంది .
- మొత్తం 33 ప్రశ్నలు రాయ డానికిగాను రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు .
- అలాగే ప్రశ్నాపత్రాన్ని చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాల సమయం ఉంటుంది .
- మెయిన్ లాంగ్వేజ్ కు మాత్రం సమయం సరిపోదని 3 గంటలు పరీక్షకు , 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదువుకోవడానికని సమయం కేటాయించారు .
- సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 3 గంటల సమయం ఇచ్చారు .
- అయితే చాయిస్ లేకపోవడం , ప్రశ్నలను నాలుగు విభాగాలు చేయడం వల్ల ఇచ్చిన సమయంలోనే పరీక్షను పూర్తి చేయడానికి విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి .
- అలాగే జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ఇస్తామనడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
- బుక్ లెట్ వల్ల మాస్ కాపీయింగ్ కు అవకాశాలుండవని కొందరు చెబుతుండగా . .
- దీర్ఘ సమాధానాలు రాసే ప్రశ్నలకు అదనపు జవాబు పత్రాలు ఇవ్వకుంటే నష్టపోయే అవకాశాలుంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నా రు .
- విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త నిర్ణయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కరిక్యులమ్ మార్చుకుని- నిర్ణీత సమయంలోనే సిలబసను పూర్తి చేయడం అటు ఉపాధ్యాయులకు , ఇటు విద్యార్థులకు కష్టతరంగా మారు తుంది .
- పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని మారుస్తూ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పాస్ మార్కుల నేవి సబ్జెక్ట్ వారీగా ఉంటాయా . . లేక పేపర్వారీగా ఉంటాయా అనేది పేర్కొనకపోవ డం విద్యార్థులను , ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తోంది .
- వచ్చే ఏడాది నుంచి అమలు చేయడం మంచిది : ఎంటీఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ
- విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కీలకమైన పదో తరగతి పరీక్షల్లో మార్పుచేర్పులు చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ . రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు . దీనివల్ల ఫలితాల్లో జీపీఏలు కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు . విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందునుంచే అవగాహన కల్పించి అప్పుడు మార్చడం మంచిది . ఈ సంవత్సరం అందరికీ అవగాహన కల్పించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం .
ప్లీస్ బ్లూ ప్రింట్ పెట్టండి
ReplyDelete