Innovative reforms in systam
- విద్యాశాఖలో కీలక సంస్కరణలు
- అడుగులు కదుపుతున్న సర్కార్
- ఉన్నత విద్య , పాఠశాల విద్య కమిషన్ల ఏర్పాటు
- రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల మిగులు.
- ఆంధ్రప్రభ విద్యాశాఖలో కీలక సంస్కరణ ల అమలు దిశగా సర్కార్ అడుగులు కదుపుతోంది .
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటిం చిన విషయం తెలిసిందే . అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేశారు . అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ కోసం బడ్జెట్లో ఏకంగా రూ 38 వేల కోట్లు కేటాయించడం సంచలనాత్మక నిర్ణయంగా భావించవచ్చు . ఈ నేపథ్యంలో ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల ఫీజులు , వాటిలోని మౌలిక వసతులు , అనుమతుల వివరాలపై దృష్టి సారిస్తామని ప్రకటించారు . అందుకోసం పాఠశాల విద్య , స్థాయిలో ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చారు . అలాగే కళాశాలల్లో అడ్డగోలుగా జరుగుతున్న దోపిడీని నియం త్రించ డం , గుర్తింపు లేని కళాశాలలను రద్దు చేయడం వంటి అంశాలపై త్వరిత గతిన నిర్ణయాలు తీసు కోగలిగేలా ఉన్నత విద్యకు ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీటితో పాటుగా . . విద్యాశాఖలో గతంలో చే పట్టిన ఒప్పందాలపై పునఃసమీక్ష చేసేందు కు రివర్స్ టెండరింగ్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . తాజాగా విద్యా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక మాజీ ఐఏఎస్ ఆధికారిని సైతం ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది .
నాడు - నేడు కోసం మానిటరింగ్ సిస్టమ్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటి ముఖ చిత్రాల ను మార్చేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది . మూడేళ్లలో పాఠశాల లన్నింటిలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేలా ' నాడు - నేడు ' పేరిట స్కూళ్ల ఫొటోలను సేకరించి ఒక యాప్లో పొందుపరిచింది . ఈ కార్యక్రమం సక్రమంగా ఆమలయ్యేలా స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ పేరిట ఎప్పటికప్పుడు చేపట్టిన చర్యలను నమోదు చేసేలా డిజిటల్ డేటా బ్యాంకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది .
0 Response to "Innovative reforms in systam"
Post a Comment