Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Innovative reforms in systam


  • విద్యాశాఖలో కీలక సంస్కరణలు 
  • అడుగులు కదుపుతున్న సర్కార్ 
  • ఉన్నత విద్య , పాఠశాల విద్య కమిషన్ల ఏర్పాటు
  • రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల మిగులు.
  • ఆంధ్రప్రభ విద్యాశాఖలో కీలక సంస్కరణ ల అమలు దిశగా సర్కార్ అడుగులు కదుపుతోంది . 
Innovative reforms in  systam

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటిం చిన విషయం తెలిసిందే . అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేశారు . అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ కోసం బడ్జెట్లో ఏకంగా రూ  38 వేల కోట్లు కేటాయించడం సంచలనాత్మక నిర్ణయంగా భావించవచ్చు . ఈ నేపథ్యంలో ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల ఫీజులు , వాటిలోని మౌలిక వసతులు , అనుమతుల వివరాలపై దృష్టి సారిస్తామని ప్రకటించారు . అందుకోసం పాఠశాల విద్య , స్థాయిలో ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చారు . అలాగే కళాశాలల్లో అడ్డగోలుగా జరుగుతున్న దోపిడీని నియం త్రించ డం , గుర్తింపు లేని కళాశాలలను రద్దు చేయడం వంటి అంశాలపై త్వరిత గతిన నిర్ణయాలు తీసు కోగలిగేలా ఉన్నత విద్యకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీటితో పాటుగా . . విద్యాశాఖలో గతంలో చే పట్టిన ఒప్పందాలపై పునఃసమీక్ష చేసేందు కు రివర్స్ టెండరింగ్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . తాజాగా విద్యా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక మాజీ ఐఏఎస్ ఆధికారిని సైతం ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది . 


నాడు - నేడు కోసం మానిటరింగ్ సిస్టమ్ 


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటి ముఖ చిత్రాల ను మార్చేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది . మూడేళ్లలో పాఠశాల లన్నింటిలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేలా ' నాడు - నేడు ' పేరిట స్కూళ్ల ఫొటోలను సేకరించి ఒక యాప్లో పొందుపరిచింది . ఈ కార్యక్రమం సక్రమంగా ఆమలయ్యేలా స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ పేరిట ఎప్పటికప్పుడు చేపట్టిన చర్యలను నమోదు చేసేలా డిజిటల్ డేటా బ్యాంకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది .

 నిజంధనలు అతిక్రమిస్తే ఉక్కుపాదం . . 

ప్రభుత్వ గుర్తింపు లేకుండా , నిబంధనలు పాటించ కుండా , మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది . అందుకోసం పాఠశాల విద్యా నియంత్రణ , పర్యవేక్షణ కమిషనన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . కమిషన్ స్వేచ్చగా పనిచేసుకోగలిగేందుకు వీలుగా నియమ నిబంధనలు సైతం రూపొందిస్తున్నారు . ఈ రెగ్యులేటరీ , మానిటరింగ్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జస్టిస్ ఆర్ . కాంతా రావును నియమించడం ద్వారా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదనే ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేశారు . విద్యావ్యవస్థలో నెలకొన్న నిర్లక్ష్య జాడ్యాన్ని రూపుమాపేలా , నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేయించగలిగేలా కమిషన్‌కు అధికారాలు కట్టబెట్టడం విశేషం . ఈ కమిషన్ ఇప్పటికే కార్యాచరణలోకి దిగడంతో పాటు అన్ని జిల్లాలడీఈవోలు , ఎంఈవోల నుంచి అన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వివరాలు , విద్యాశాఖప్రభుత్వం . . . గుర్తింపు కోసం సమర్పించిన రికార్డులలో ఉన్న ఫీజు - వివరాలను పరిశీలించే పనిని ప్రారంభించింది.

 ఉన్నత విద్య కమిషన్ కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు 

రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల స్థితిగతులను పరిశీలిం చేందుకు ప్రభుత్వం ఉన్నత విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్రంలో పలు ప్రైవేట్ , కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించిన విద్యార్థులను చేర్చుకుంటూ ఇష్టారీతిగా కొనసాగుతున్నాయి . అలాగే సరైన బోధనా సిబ్బంది , వసతి సదుపాయాలు లేకుండానే భారీ ఫీజులను వసూలు చేస్తున్నాయి . వీటిని నియంత్రించేం దుకు ఉన్నత విద్య రెగ్యులేటరీ , మానిటరింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ కమిషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారం భించేందుకు అవసరమైన స భ్యులను నియమించుకునేం దుకు నలుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ సెక్స్ కమిటీ నిస్పక్ష పాతంగా వ్యవహరించగల విద్యా వేత్తలు , న్యాయ నిపుణులను సభ్యులుగా ఎంపిక చేయనుంది.

రివర్స్ టెండరింగ్ ' నిధులు ఆదా 

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జలవ నరులు , విద్యుత్ శాఖల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం విదితమే . ఈ నేపథ్యంలో ఇదే తరహా ప్రయోగాన్ని విద్యాశాఖలోనూ చేపట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు మిగల్చాలని భావిస్తోంది . . అందుకోసం గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు , చెల్లింపులు జరిపిన బిల్లులను నిశితంగా పరిశీలించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం . అలాగే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అధిక చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు లభిస్తే తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది .

 అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ . . . 

రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకు తీసుకొచ్చేం దుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వేదికలపై స్పష్టం చేసిన విషయం తెలిసిందే . ఇందుకోసం పలు రాష్ట్రాలు విద్య విషయంలో తీసుకొస్తున్న పథకాలపై అధ్యయనం చేసి . . మన రాష్ట్రానికనుగుణంగా కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రణాళిక లు రూపొందించాలని భావిస్తోంది . అందులో భాగంగా . . . మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్రంలో విద్యను బలోపేతం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చేందుకు మూడేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు . 2022 నాటికి ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మాళిక వసతుల కొరత లేకుండా ఉండాలని , నిరక్ష్యరాస్యత అనేది పూర్తిగా పోవాలనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే దిశగా ఇప్పటికే ఆయా విభాగాలు కార్యాచరణ ప్రారంభించాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Innovative reforms in systam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0