There is a shortage of candidates for 20,959 posts in secretariat jobs
సచివాలయ ఉద్యోగాలలో.20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
- గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వివిధ టెక్నికల్ అనుబంధిత రంగాలకు చెందిన 20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
- సచివాలయం మొదటి దశ భర్తీలో భాగంగా ఆరు విభాగాల్లో మిగిలిన పోస్టుల కంటే..క్వాలిఫైడ్ అయినవారు తక్కువుగా ఉన్నారు.
- పశుసంవర్థక శాఖ, పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు చెందిన ఆరు విభాగాల్లో మొత్తంగా 39,176 ఖాళీలున్నాయి.
- వాటికి మొత్తంగా 18,217మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంకా తొలివిడత భర్తీ అనంతరం 20,959 పోస్టులు మిగిలినట్లు తెలుస్తోంది.
- పశుసంవర్థక శాఖలో మొత్తం 9,886 ఖాళీలకుగాను 2,163 మంది అర్హత సాధించగా, 7,723 పోస్టులు మిగిలాయి.
- పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్లో 11,158 ఖాళీలకుగాను 3,623 మంది అర్హత సాధించగా, 7,535 పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
- వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలో 3,648 పోస్టులకుగాను 1,474 మంది అర్హత సాధించగా, మరో 2,174 పోస్టులు మిగిలిపోయాయి.
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లో 4వేల పోస్టులకుగాను 2,622 మంది అర్హత సాధించగా, 1,378 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
- వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ విభాగంలో 3,770 పోస్టులకుగాను 2,096 మంది అర్హత సాధించగా, 1,674 పోస్టులు మిగిలాయి.
- విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లో 6,714 పోస్టులకుగాను 6,239 మంది అర్హులుకాగా, మరో 475 పోస్టులకు అభ్యర్థుల్లేరు.
- ఈ మిగిలిన పోస్టులకు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించి భర్తీ చేస్తారనే ఆశతో అభ్యర్థులున్నారు.
- ఆయా కేటగిరీల ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత తగ్గుతాయనే అంశంఫై గందరగోళం నెలకొంది.
- ఇప్పటివరకు భర్తీ చేసిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 150 మార్కులకు ఓసీ40, బీసీ35, ఎస్సీ,ఎస్టీలు 30శాతం చొప్పున మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్ అభ్యర్థులుగా ప్రకటించారు.
- ఆయా కేటగిరీల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారి నుంచి ఉద్యోగాల్ని భర్తీ చేశారు.
- ఇప్పుడు మిగిలిన పోస్టులకు కటాఫ్ మార్కులు తగ్గించి భర్తీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
- దీంతో ఆరు విభాగాల పోస్టుల్ని ప్రభుత్వమెలా భర్తీ చేస్తుందనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
జనవరిలో మిగులు పోస్టులకు నోటిఫికేషన్..?
- జనవరిలో పలు విభాగాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది.
- ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిఏటా జనవరిని రిక్రూట్మెంట్ నెలగా ప్రకటించారు.
- దీంతో అన్ని విభాగాలకు ఆ నెలలో నోటిఫికేషన్లు వెల్లడించాలి.
- సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులున్నారు.
- డీఎస్సీ-2018 ఉపాధ్యాయ పోస్టుల్లో క్వాలిఫైడ్ అయి, సచివాలయ పోస్టుల్ని కొందరు కైవసం చేసుకున్నారు.
- ఈ పోస్టులకు ఇంకా ఫలితాల్ని వెల్లడించలేదు.
- గ్రూప్-2,3, డీఎస్సీ పోస్టుల్లో వేతనాలు ఎక్కువుగా ఉంటాయి.
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రారంభంలోనే పర్మినెంట్ ఉద్యోగులుగా నిర్ణయిస్తారు.
- సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తారు.
- ఈలోగా ఇతర పోస్టులకు వెళ్తే, వారంతా సర్వీసులో పొందిన వేతనాల్ని ప్రభుత్వానికి చెల్లించాలి.
- గ్రూప్స్, డీఎస్సీ పోస్టులకు దాదాపు 3వేల మంది అభ్యర్థులు వెళ్లిపోయే అవకాశముంది.
- దీంతో సచివాలయానికి చెందిన కేటగిరి-1తోపాటు పలు పోస్టులు ఖాళీ అవుతాయి.
- వాటికి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం.
- ప్రస్తుతం మిగిలిపోయిన ఆరు విభాగాల పోస్టులకు కటాఫ్ కుదించి భర్తీ చేస్తేనే ఖాళీలు పూర్తవుతాయి.
- లేకుంటే వాటన్నిటికీ తక్కువ ఖాళీలతో మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరముంది.
0 Response to "There is a shortage of candidates for 20,959 posts in secretariat jobs"
Post a Comment