Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There is a shortage of candidates for 20,959 posts in secretariat jobs

సచివాలయ ఉద్యోగాలలో.20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.    
There is a shortage of candidates for 20,959 posts in secretariat jobs

  • గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వివిధ టెక్నికల్‌ అనుబంధిత రంగాలకు చెందిన 20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
  •  సచివాలయం మొదటి దశ భర్తీలో భాగంగా ఆరు విభాగాల్లో మిగిలిన పోస్టుల కంటే..క్వాలిఫైడ్‌ అయినవారు తక్కువుగా ఉన్నారు.
  • పశుసంవర్థక శాఖ, పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్‌, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, వార్డు ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ సెక్రటరీ, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు చెందిన ఆరు విభాగాల్లో మొత్తంగా 39,176 ఖాళీలున్నాయి. 
  • వాటికి మొత్తంగా 18,217మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంకా తొలివిడత భర్తీ అనంతరం 20,959 పోస్టులు మిగిలినట్లు తెలుస్తోంది.
  • పశుసంవర్థక శాఖలో మొత్తం 9,886 ఖాళీలకుగాను 2,163 మంది అర్హత సాధించగా, 7,723 పోస్టులు మిగిలాయి.
  • పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌-6 డిజిటల్‌ అసిస్టెంట్‌లో 11,158 ఖాళీలకుగాను 3,623 మంది అర్హత సాధించగా, 7,535 పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
  • వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలో 3,648 పోస్టులకుగాను 1,474 మంది అర్హత సాధించగా, మరో 2,174 పోస్టులు మిగిలిపోయాయి.
  • విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లో 4వేల పోస్టులకుగాను 2,622 మంది అర్హత సాధించగా, 1,378 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది.
  • వార్డు ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ విభాగంలో 3,770 పోస్టులకుగాను 2,096 మంది అర్హత సాధించగా, 1,674 పోస్టులు మిగిలాయి.
  • విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లో 6,714 పోస్టులకుగాను 6,239 మంది అర్హులుకాగా, మరో 475 పోస్టులకు అభ్యర్థుల్లేరు.
  • ఈ మిగిలిన పోస్టులకు క్వాలిఫైయింగ్‌ మార్కులు తగ్గించి భర్తీ చేస్తారనే ఆశతో అభ్యర్థులున్నారు.
  •  ఆయా కేటగిరీల ఆధారంగా క్వాలిఫైయింగ్‌ మార్కులు ఎంత తగ్గుతాయనే అంశంఫై గందరగోళం నెలకొంది.
  •  ఇప్పటివరకు భర్తీ చేసిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 150 మార్కులకు ఓసీ40, బీసీ35, ఎస్సీ,ఎస్టీలు 30శాతం చొప్పున మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌ అభ్యర్థులుగా ప్రకటించారు. 
  • ఆయా కేటగిరీల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారి నుంచి ఉద్యోగాల్ని భర్తీ చేశారు. 
  • ఇప్పుడు మిగిలిన పోస్టులకు కటాఫ్‌ మార్కులు తగ్గించి భర్తీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
  •  దీంతో ఆరు విభాగాల పోస్టుల్ని ప్రభుత్వమెలా భర్తీ చేస్తుందనేదీ ప్రశ్నార్థకంగా మారింది.

జనవరిలో మిగులు పోస్టులకు నోటిఫికేషన్‌..?


  • జనవరిలో పలు విభాగాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. 
  • ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిఏటా జనవరిని రిక్రూట్‌మెంట్‌ నెలగా ప్రకటించారు. 
  • దీంతో అన్ని విభాగాలకు ఆ నెలలో నోటిఫికేషన్లు వెల్లడించాలి.
  •  సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల్లో క్వాలిఫైడ్‌ అయిన అభ్యర్థులున్నారు. 
  • డీఎస్సీ-2018 ఉపాధ్యాయ పోస్టుల్లో క్వాలిఫైడ్‌ అయి, సచివాలయ పోస్టుల్ని కొందరు కైవసం చేసుకున్నారు. 
  • ఈ పోస్టులకు ఇంకా ఫలితాల్ని వెల్లడించలేదు. 
  • గ్రూప్‌-2,3, డీఎస్సీ పోస్టుల్లో వేతనాలు ఎక్కువుగా ఉంటాయి. 
  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రారంభంలోనే పర్మినెంట్‌ ఉద్యోగులుగా నిర్ణయిస్తారు. 
  • సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్‌ చేస్తారు.
  •  ఈలోగా ఇతర పోస్టులకు వెళ్తే, వారంతా సర్వీసులో పొందిన వేతనాల్ని ప్రభుత్వానికి చెల్లించాలి. 
  • గ్రూప్స్‌, డీఎస్సీ పోస్టులకు దాదాపు 3వేల మంది అభ్యర్థులు వెళ్లిపోయే అవకాశముంది. 
  • దీంతో సచివాలయానికి చెందిన కేటగిరి-1తోపాటు పలు పోస్టులు ఖాళీ అవుతాయి.
  •  వాటికి జనవరిలో నోటిఫికేషన్‌ ఇస్తారని సమాచారం. 
  • ప్రస్తుతం మిగిలిపోయిన ఆరు విభాగాల పోస్టులకు కటాఫ్‌ కుదించి భర్తీ చేస్తేనే ఖాళీలు పూర్తవుతాయి.
  •  లేకుంటే వాటన్నిటికీ తక్కువ ఖాళీలతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరముంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There is a shortage of candidates for 20,959 posts in secretariat jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0