LuckyChance for Secretariat candidates
- అర్హులు లేకపోవడంతో అదనంగా 15 మార్కులు కలిపి మరీ ఉద్యోగం
- ‘సచివాలయ’ అభ్యర్థులకు లక్కీచాన్స్
- ప్రతి విభాగంలోనూ 15 అదనపు మార్కులు
- మిగిలిన 25 వేల పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు
గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయిన 25వేల పోస్టుల భర్తీకి ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 15 మార్కులు అదనంగా కలిపి ఈ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది. సీఎంవో, పంచాయతీరాజ్శాఖ అధికారులు బుధవారం జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా పోస్టుల నియామకంపై ఆదేశాలిచ్చారు.
వలంటీర్ పోస్టుల భర్తీకి నేడో రేపో నోటిఫికేషన్
ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి పురపాలక శాఖ ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 68,797 వార్డు వలంటీర్ పోస్టులుండగా, 51,108 మాత్రమే విధుల్లో ఉన్నారు. వివిధ కారణాలతో 17,689 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 1 నుంచి వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
0 Response to "LuckyChance for Secretariat candidates"
Post a Comment