New versions of 10 th class Examination s
' పది ' పరీక్షల్లో నూతన సంస్కరణలు.
- బిట్ పేపర్ స్థానంలో లఘు సమాధాన ప్రశ్నలు
- 24 పేజీల బుక్ లెట్ పంపిణీ
- పేపర్ , సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు
- కొత్త విధానంపై జీవో విడుదల.
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది . విద్యార్థుల భావవ్యక్తీకరణ , సృజనాత్మకత , భాషా నైపుణ్యాలు , అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపుదిద్దింది . ఇందులో బిట్ పేపర్ రద్దు సహా అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది . ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు ( జీఓ 63 ) జారీ చేశారు . 2019 - 20 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న పరీక్షల నుంచే ఈ నూతన విధానం అమలుకానుంది .
ప్రధాన మార్పులు ఇవీ . . .
పరీక్షలలో విద్యార్థులకు ఈ పేజీల సమాధాన పుస్తకం ( ఆన్సర్ బుక్ లెట్ ) ఇస్తారు . అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు . బిట్ పేపర్ వేరేగా ఉండదు . ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు , సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు . - హిందీ , ఓఎస్సెస్సీ , కాంపోజిట్ తెలుగు తప్ప మిగిలిన అన్ని పరీక్షలకు సమయం 2 : 30 గంటలు . ప్రశ్నపత్రం చదివేందుకు మరో 15 నిమిషాలు . హిందీ పరీక్షకు 3 గంటలు , ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ , కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3 . 15 గంటల సమయం ఉంటుంది . » సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా , పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు . సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది . ప్రశ్నపత్రం స్వరూపం ఇలా ఉంటుంది .50 మార్కులకు
" ఒక్కో ప్రశ్నకు ఆర మార్కు చొప్పున 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 6 మార్కులు . 8 అతిలఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 8 మార్కులు . - 8 లఘు ప్రశ్నలకు ఒక్కొక్క దానికి రెండేసి మార్కుల చొప్పున 16 . | 5 వ్యాస రూప ( ఎస్సే ) ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి .ఉత్తీర్ణత పై అస్పష్టత
ఇదిలా ఉండగా విద్యార్థుల పాస్ మార్కులపై ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు . సబ్జెక్టుల వారీగా కాకుండా పేపర్ వారీగా పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పొందు పరిచారు . అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది . దీని వల్ల విద్యార్థులు ఒక పేపర్లో ఎక్కువ మార్కులు సాధించినా రెండో పేపర్లో పాస్ మార్కులు రాకుంటే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు . ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పాస్ మార్కుల గురించి ప్రస్తావించలేదు . దీంతో పాత పద్ధతిలో సబ్జెక్టుల వారీగానే పాసు మార్కులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి .ప్రశ్నపత్రం బ్లూ. ప్రింట్ ఇలా
ప్రశ్న విధానం. ప్రశ్నలు మార్కులు మొత్తం శాతంఆబ్జెక్టివ్ టైప్. 12 అర. 6 12
అతి చిన్న ప్రశ్నలు 8 1 8 16
చిన్న ప్రశ్నలు 8 2 16 32
పెద్ద ప్రశ్నలు 5 4 20 40
మొత్తం 33 - 50 100
0 Response to "New versions of 10 th class Examination s"
Post a Comment