- డిగ్రీ పరీక్షల్లో సరికొత్త విధానం.. ఇకనుంచి జవాబు పత్రంపై పేరుతో పాటు..
- డిగ్రీ పరీక్షల్లో బార్ కోడింగ్ విధానం
- సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
- ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి
ఆంధ్రా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో తొలిసారిగా బార్కోడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రసాద్రెడ్డి చెప్పారు. ఈ నెల 17 నుంచి డిగ్రీ సెమిస్టర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీలో విద్యార్థులకు అందించే జవాబు పత్రం బుక్లెట్పై తొలిసారిగా ప్రత్యేక బార్కోడ్ను ముద్రించడం జరుగుతుందన్నారు. బుక్లెట్పై విద్యార్థి పేరు, బార్కోడ్ను ముద్రించడం జరిగిందన్నారు. వర్సిటీలో పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి, సత్వరం ఫలితాలను అందించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని చెప్పారు.
ప్రశ్నపత్రాలు సిద్ధం
పరీక్షల నిర్వహణకు అవరసమైన ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ, పరీక్ష కేంద్రాలకు పంపే ప్రక్రియను పూర్తిచేశామన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రశ్నాపత్రంలో ఎటువంటి తప్పులు దొర్లినా, సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చినా విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్ సహకారంతో వెంటనే వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
పరీక్షల నిర్వహణలో వర్సిటీ నియామావళిని ఉల్లంఘించి ఎటువంటి మాస్ కాపీయింగ్ను ప్రోత్సహించినా, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి చర్యలకు పాల్పడినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని వివరించారు. అదే విధంగా నిబంధలను అతిక్రమించిన కళాశాలల గుర్తింపు(అఫిలియేషన్)ను సైతం 10 ఏళ్ల పాటు రద్దు చేస్తామని వీసీ ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.
0 Response to "Newest approach in degree exams."
Post a Comment