- గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు.
- ' డబ్బు చెల్లించిన వెంటనే ట్రాన్సిట్ పాన్లు 48 గంటల పాటు చెల్లుబాటు
- నదుల్లో వరద నేపథ్యంలో వాగులు , వంకలు , ఏరులలో ఇసుక వినియోగానికి విధి విధానాలు జారీ
- ప్రతి జిల్లాలో 1 - 3 ఆర్డర్ రీచ్ గుర్తింపు బాధ్యత కలెక్టర్లకే
- వలంటీర్లకు రీచ్ పర్యవేక్షణ బాధ్యత
- వాల్టా చట్టం పకడ్బందీగా అమలు
- 3 నెలల తర్వా త మరోసారి సమీక్షించనున్న ప్రభుత్వం
రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు , వంకలు , ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇందులో భాగంగా ఏరులు , వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు , రవాణాను క్రమబద్దీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది . ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్టీమ్స్ గా పరిగణించే వంకలు , వాగులు , ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది . గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది .
ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు . . .
ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు . వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది . ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయనసూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది . ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్టీమ్స్ లో ఇసుక తవ్వకాలు , వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని , తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది .
ఇసుక రీచ్ ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు
భారీగా ఇసుక లభించే గోదావరి , కృష్ణా , తుంగభద్ర , వంశధార , పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతనువంకలు , ఏరులు , వాగుల ద్వారా అధిగమిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది . అప్ టు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది . ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీ లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది . ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు ( వ్యాపారానికి కాదు ) మాత్రమే వినియోగించు కునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు .
సరఫరా ఇలా . . .
ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ ( ట్రాన్సిట్ పాస్ ) తీసుకోవాలి . సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు . ఇసుక రీచ్ పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్చార్జి సంబంధిత వలంటీరు అప్పగిస్తారు . సచివాలయంలో డబ్బులుచెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్ ను . . వలంటీరు ఇచ్చి ట్రాక్టరు , ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు . ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది . నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్ చెల్లుబాటు కాదు . ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు .
పర్మిట్ తప్పనిసరి . .
ఇసుక రవాణా పర్మిట్ పాన్ల జారీ కోసం ముద్రించిన ఫారం - ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది . ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి . పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు . ప్రతి పాసకు ఒరిజనల్ , డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి . దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి . వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది .
భారీ వరదలు , వర్షాలతో . . . .
మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుకతవ్వకం , సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని ప్రకటించింది . ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ( ఏపీఎండీసీ ) కి అప్పగించింది . ఈ సీజన్లో అన్ని నదుల్లో నిరంతరాయంగా వరద కొనసాగుతోంది . ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది . నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్ లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది .
ఐదేళ్లకు సరిపడా నిల్వలు
ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి . వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్ లో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు . ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది . ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది . వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు
0 Response to "Sand permits in village secretaries. 'Transit pans are valid for 48 hours immediately after payment"
Post a Comment