Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Schools Online

బడుల ఆన్‌లైన్‌ బాట
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రభుత్వం చర్యలు
  ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతో శిక్షణ
Schools Online

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ ఏడాది 900 ప్రభుత్వ పాఠశాలల్లో వ్యక్తిగత అనుసరణీయ బోధనను (పాల్‌) అమలు చేయాలని నిర్ణయించారు. డిసెంబరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు బోధన చేయనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో పాఠశాలకు 30 ట్యాబ్‌లుగానీ, ల్యాప్‌టాప్‌లు ఇస్తారు. ఇప్పటికే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని 60 పాఠశాలల్లో అమలు చేయగా ఉత్తమ ఫలితాలు రావడంతో మరింత విస్తరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో కేవలం తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ విధానంలో బోధన చేశారు. గతేడాది కొంత ఆలస్యంగా నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 100 పాఠశాలల చొప్పున పాల్‌ను ప్రారంభించగా.. ఇక్కడ 6 నుంచి 9 తరగతుల వరకు పూర్తిగా ట్యాబ్‌లతో బోధన చేస్తున్నారు.

అమలు, బోధన ఇలా..

6 నుంచి 9 తరగతుల వరకు 900 సర్కారు బడుల్లో పాల్‌ను అమలుచేస్తారు. ఒక్కో పాఠశాలకు 30 చొప్పున 600 స్కూళ్లకు ల్యాప్‌టాప్‌లు, 300 పాఠశాలలకు ట్యాబ్‌లను అందజేస్తారు. బీ ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల్లో గణితం, ఆంగ్ల సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను అప్‌లోడ్‌చేస్తారు. వాటి నుంచే ప్రశ్నలు ప్రదర్శితమవుతాయి.
ఉదాహరణకు విద్యార్థులు గణితంలో లెక్కలను చేసుకుంటూ వెళ్తుంటే ఆ తర్వాత స్థాయిలోనివి వాటంతట అవే వస్తాయి. ఒక వేళ విద్యార్థి ఆరోతరగతి స్థాయి లెక్కలను చేయలేకపోతే ఐదో తరగతి స్థాయిలోనివి వస్తాయి. ఇవీ చేయలేకపోతే అంతకంటే తక్కువస్థాయి లెక్కలు వస్తుంటాయి. దీంతో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో సులభంగా తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Schools Online"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0